America | అమెరికాలో తెలుగు యువతి హత్య

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిఖిత గొడిశాల (27) అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మేరీలాండ్‌ (Maryland)లో ఉన్న కొలంబియాలో ఆమె వారం రోజుల నుంచి కనిపించడం లేదు. న్యూ ఇయర్​ వేడుకల (New Year Celebrations) అనంతరం కనిపించకుండా పోయినట్లు సమాచారం. తాజాగా ఆమె మృతదేహాన్ని పోలీసులు ఆమె మాజీ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : America | అమెరికాలో తెలుగు యువతి దారుణ హత్యకు గురైంది. వారం క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
నిఖిత గొడిశాల (27) అనే యువతి ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లింది. మేరీలాండ్‌ (Maryland)లో ఉన్న కొలంబియాలో ఆమె వారం రోజుల నుంచి కనిపించడం లేదు.

న్యూ ఇయర్​ వేడుకల (New Year Celebrations) అనంతరం కనిపించకుండా పోయినట్లు సమాచారం. తాజాగా ఆమె మృతదేహాన్ని పోలీసులు ఆమె మాజీ ప్రియుడు అర్జున్​ అపార్ట్​మెంట్​లో గుర్తించారు. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

America | పోలీసులకు ఫిర్యాదు

నిఖిత ప్రస్తుతం హోవర్డ్ కౌంటీ (Howard County)లో ఉన్న ఎల్లికాట్ సిటీలో డేటా, స్ట్రాటజీ అనలిస్ట్‌ (Strategy Analyst)గా పనిచేస్తుంది. ఆమె కనిపించడం లేదని ఆమె మాజీ ప్రియుడు అర్జున్​ శర్మ జనవరి 2న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అతడు పరారు అయ్యాడు. అయితే మేరీల్యాండ్‌ సిటీలోని అర్జున్‌శర్మ ఫ్లాట్‌లో ఆమె డిసెంబర్‌ 31న చివరిసారి కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడి ప్లాట్​లో తనిఖీ చేయగా.. హత్య విషయం వెలుగు చూసింది. అర్జున్‌ శర్మనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు. అయితే అతడు భారత్​కు వచ్చినట్లు సమాచారం. పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. కాగా నిఖిత హైదరాబాద్​ (Hyderabad)నగరంలోని సికింద్రాబాద్​ ప్రాంతానికి చెందిన యువతిగా సమాచారం.

Related articles

Hitler police station | పోలీస్​ ఠాణాగా హిట్లర్​ హోం.. రూ. 247 కోట్లతో రెనోవేషన్​!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hitler police station | ఆస్ట్రియా దేశ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన  జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్...

Kishtwar Encounter Operation | జమ్మూకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఉగ్రవాదులు హతం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kishtwar Encounter Operation | జమ్మూ కశ్మీర్​లో ఆదివారం ఎన్​కౌంటర్​ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు ఉగ్రవాదులు చనిపోయారు....

Kamareddy College Land Dispute | ముదురుతున్న కళాశాల ఆస్తుల వివాదం.. ఎమ్మెల్యే రాజీనామాస్త్రం

కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల (Govt Degree College) ఆస్తుల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఈ అంశం రాజకీయ ఆరోపణలకు అస్త్రంగా మారుతూనే ఉంది.

Vemula Prashanth Reddy Protest | రైతుల కోసం పోరాడితే అక్రమ కేసులా : మాజీ మంత్రి వేముల

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.