Operation Sindoor | జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మృతి
Operation Sindoor | జమ్మూకశ్మీర్‌లో తెలుగు జవాన్‌ మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్: Operation Sindoor | ఆపరేషన్​ సిందూర్​తో భారత్​(India) పాక్​లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అంతేగాకుండా పాక్​ దాడులను(Pakistan Attacks) భారత్​ తిప్పి కొడుతోంది. దీంతో పాకిస్తాన్​ ఎల్​వోసీ(LOC) వెంబడి నిత్యం కాల్పులకు తెగబడుతోంది. సామాన్య పౌరులే లక్ష్యంగా పాక్​ కాల్పులు జరుపుతోంది. అయితే పాక్​ కాల్పులను భారత బలగాలు(Indian Forces) తిప్పికొడుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్​ కాల్పుల్లో భారత జవాన్​ మురళీనాయక్‌(Indian soldier Murali Naik) మృతి చెందాడు. ఆయన స్వస్థలం ఏపీలోని సత్యసాయి జిల్లా కల్లి తండా. రేపు మురళీనాయక్‌ మృతదేహాన్ని ఆర్మీ అధికారులు(Army Officers) స్వగ్రామానికి తీసుకు రానున్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది.