Telangana University | వంటల్లో నాసిరకం వస్తువులు వాడుతున్నారని విద్యార్థుల ధర్నా

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | వంటల్లో నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్​లో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి నాసిరకం వస్తువులను తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారని ఆరోపించారు. దీంతో తాము తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. Telangana University | ఓల్డ్​ బాయ్స్​ హాస్టల్​లో.. తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ […]

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | వంటల్లో నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్​లో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి నాసిరకం వస్తువులను తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారని ఆరోపించారు. దీంతో తాము తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana University | ఓల్డ్​ బాయ్స్​ హాస్టల్​లో..

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్​లోని (Old Boys Hostel) మెస్ స్టోర్​లో పూర్తిగా నాసిరకమైన వస్తువులే ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల అండతోనే ఈ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్​ యాదగిరి, వార్డెన్​, ప్రిన్సిపాల్​ ధర్నా స్థలానికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

Related articles

ASHA Workers Arrest | సీఐటీయూ, ఆశకార్యకర్తల ముందస్తు అరెస్ట్​

బాన్సువాడ పట్టణంలో సీఐటీయూ నాయకులను, ఆశకార్యకర్తలను పోలీసులు అరెస్ట్​ చేశారు. అనంతరం పోలీస్​స్టేషన్​కు తరలించారు.

Soumya Government Job | ఎక్సైజ్ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం

విధినిర్వహణలో గంజాయి ముఠాను పట్టుకునే క్రమంలో ఎక్సైజ్​ కానిస్టేబుల్​ గాజుల సౌమ్య మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రభుత్వం ఆమె​ సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది.

Hyderabad CP Marriage Warning | పెళ్లికి ముందు దగ్గరవ్వొద్దు.. అమ్మాయిలకు సీపీ హెచ్చరిక

పెళ్లి పేరుతో జరిగే మోసాలపై యువతులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్​ సూచించారు. డబ్బులు డిమాండ్​ చేస్తే ఫిర్యాదు చేయాలన్నారు.

TTD Laddu Case Verdict | టీటీడీ లడ్డూ కేసులో ప్రభుత్వానికి ఊరట..

టీటీడీ లడ్డూ కేసులో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఏకసభ్య కమిటీ విచారణ కొనసాగించవచ్చని ధర్మాసనం పేర్కొంది.