Homeజిల్లాలునిజామాబాద్​Telangana University | వంటల్లో నాసిరకం వస్తువులు వాడుతున్నారని విద్యార్థుల ధర్నా

Telangana University | వంటల్లో నాసిరకం వస్తువులు వాడుతున్నారని విద్యార్థుల ధర్నా

వంటల్లో నాసిరకం వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం వర్సిటీలో ధర్నాకు దిగారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | వంటల్లో నాణ్యత లేని వస్తువులు వాడుతున్నారని తెలంగాణ యూనివర్సిటీలో విద్యార్థులు ఆరోపించారు. ఈ మేరకు సోమవారం క్యాంపస్​లో ధర్నా చేపట్టారు.

ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకులు చందాల కోసం కాంట్రాక్టర్లతో చేతులు కలిపి నాసిరకం వస్తువులను తీసుకొచ్చి వంటల్లో వాడుతున్నారని ఆరోపించారు. దీంతో తాము తినలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana University | ఓల్డ్​ బాయ్స్​ హాస్టల్​లో..

తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఓల్డ్ బాయ్స్ హాస్టల్​లోని (Old Boys Hostel) మెస్ స్టోర్​లో పూర్తిగా నాసిరకమైన వస్తువులే ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. కొంతమంది విద్యార్థి సంఘాల నాయకుల అండతోనే ఈ వ్యవహారం నడుస్తోందని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్​ యాదగిరి, వార్డెన్​, ప్రిన్సిపాల్​ ధర్నా స్థలానికి వచ్చి విద్యార్థులతో మాట్లాడారు. వారి నుంచి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో విద్యార్థులు ధర్నా విరమించారు.

Must Read
Related News