HomeతెలంగాణPhones Recovery | ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్​

Phones Recovery | ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్​

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Phones Recovery | ఒకప్పుడు సెల్​ఫోన్​ Cell Phone పోయిందంటే.. దానిపై ఆశలు వదిలేసుకునే వాళ్లం. కొత్త ఫోన్​ కొనుగోలు చేసేవాళ్లం. కానీ కేంద్ర ప్రభుత్వం అమలులోకి తీసుకొచ్చి సీఈఐఆర్ పోర్టల్ ceir portal​తో పోయిన ఫోన్లు మళ్లీ చేతికి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా సీఈఐఆర్​ పోర్టల్​ ద్వారా సెల్​ఫోన్లు రికవరీ చేస్తుండగా.. అందులో తెలంగాణ telangana అగ్రస్థానంలో ఉంది. ఈ పోర్టల్​ ఉపయోగించి ఇప్పటి వరకు తెలంగాణ పోలీసులు telangana police 78,231 ఫోన్లు స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.

Phones Recovery | హైదరాబాద్​లోనే అధికం

సెల్​ఫోన్ల రికవరీలో హైదరాబాద్​ కమిషనరేట్ hyderabad ​Commissionerate అగ్రస్థానంలో ఉంది. ఇప్పటి వరకు ఈ కమిషనరేట్​ పరిధిలో 11,879 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్ కమిషనరేట్​లో 10,385, రాచకొండ కమిషనరేట్లో 8,681 ఫోన్లు రికవరీ చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐడీ డీజీ శిఖా గోయల్ సీఐడీ అధికారులను అభినందించారు.

Phones Recovery | ఫోన్ల దొంగలకు చుక్కలే..

గతంలో రద్దీ ప్రాంతాల్లోకి వెళ్లామంటే ఫోన్​పై ఓ చేయి వేసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే గుంపులో దొంగలు చేతివాటం ప్రదర్శించి ఫోన్​ మాయం చేసేవారు. గ్రామాల్లోని వారసంతల నుంచి మొదలు పెడితే నగరాల్లోని మల్టీప్లెక్స్​ల వరకు ఈ సమస్య ఉండేది. ముఖ్యంగా బస్టాండ్​లు, రైల్వేస్టేషన్​లలో ఆదమరిస్తే ఫోన్​ దొంగలు రెచ్చిపోయేవారు. బస్సు, ట్రెయిన్​ ఎక్కేటప్పుడు ఫోన్లు లాక్కొని పారిపోయేవారు. అయితే సీఈఐఆర్​ పోర్టల్​ అందుబాటులోకి వచ్చాక సెల్​ఫోన్​ దొంగల పప్పులు ఉడకడం లేదు. ఫోన్లు కొట్టేసినా.. బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వెంటన్​ బ్లాక్​ చేస్తున్నారు. అనంతరం దానిని రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తున్నారు.

Phones Recovery | ఇలా ఫిర్యాదు చేయాలి

సెల్​ఫోన్​ పోతే వెంటనే సీఈఐఆర్​ పోర్టల్​లో లాగిన్​ అయి ఫిర్యాదు చేయాలి. లేదంటే పోలీస్​ స్టేషన్​కు వెళ్లికూడా ఫిర్యాదు చేయొచ్చు. దీని కోసం ఫోన్​ ఐఎంఈఐ imei నంబర్​ అవసరం ఉంటుంది. కాబట్టి ఫోన్​ కొనుగోలు చేసిన సమయంలో ఇచ్చిన రశీదు జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఫోన్​ పోగానే ఆ రశీదు తీసుకెళ్లి ఫిర్యాదు చేస్తే పోలీసులు సీఈఐర్​ పోర్టల్​ ద్వారా వెతికి పట్టుకుంటారు. తెలంగాణ పోలీసులు ఇప్పటి వరకు ఈ పోర్టల్​ ద్వారా 3,37,610 ఫోన్లు బ్లాక్​ చేశారు. అందులో 1,88,279 ఫోన్లను గుర్తించారు. 78,231 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించారు.