అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana temperature rise | బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. అకాల వర్షాలు (Rains) ముగిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
పలు జిల్లాల్లో అక్కడక్కడ మూడు రోజులుగా తేలిక పాటి నుంచి మోస్తరు జల్లులు కురిశాయి. పలు పంటలకు ఈ వర్షాలు మేలు చేయగా.. మరికొన్ని పంటలకు నష్టం చేశాయి. ముఖ్యంగా ఆరబెట్టిన పసుపు, శనగ తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మరోవైపు వరి, మొక్కజొన్న వంటి పంటలకు నీరు అవసరం అయిన సమయంలో వర్షాలు ఆదుకున్నాయని పలువురు అన్నదాతలు పేర్కొంటున్నారు.
Telangana temperature rise | మండనున్న ఎండలు
రాష్ట్రంలో బుధవారం వాతావరణం మేఘావృతమై ఉంటుంది. అయితే వర్షాలు కురిసే అవకాశం లేదు. పలు ప్రాంతాల్లో చలిగాలులు వీస్తాయి. గురువారం నుంచి ఎండలు మండనున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 28 తర్వాత తీవ్రమైన వేడి పరిస్థితులు ఉంటాయి. మార్చి 2 నుంచి 7 వరకు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తూర్పు, ఉత్తర తెలంగాణలో తీవ్రమైన వేడి గాలులు వీస్తాయి. కొన్ని చోట్ల 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. హైదరాబాద్ (Hyderabad) నగరంలో 37 డిగ్రీల టెంపరేటచర్ దాటుతుందని అధికారులు తెలిపారు.
