అక్షరటుడే, ఇందూరు: Telangana Rising | తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు రూపకల్పనకై ఉద్దేశించిన ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సిటిజన్ సర్వేకు(Citizen Survey) ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) తెలిపారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. ఈ సిటిజన్ సర్వేలో కేవలం తెలంగాణ నుండే కాకుండా వివిధ ప్రాంతాల నుండి కూడా అన్ని వర్గాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందజేస్తున్నారని అన్నారు.
Telangana Rising | స్వాతంత్య్రం వచ్చి వందేళ్లు పూర్తయిన సందర్భంగా..
దేశ స్వాతంత్య్రానికి వంద సంవత్సరాలు పూర్తవుతున్న సందర్బంగా 2047 నాటికి తెలంగాణ రాష్ట్రం ఎలా ఉండాలో ప్రజల నుండి తగు సలహాలు, సూచనలు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్ – 2047’ సిటిజన్ సర్వేను చేపట్టిందని కలెక్టర్ వివరించారు.
రాష్ట్ర ప్రభుత్వం గత వారం ప్రారంభించిన ఈ సర్వే ఈనెల 25 వతేదీతో ముగుస్తుందన్నారు. www.telangana.gov.in /telanganarising వెబ్సెట్ను సందర్శించి ప్రతిఒక్కరూ తమ అమూల్యమైన సలహాలు, సూచనలను అందించాలని కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఒక ప్రకటనలో కోరారు.