ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Banakacherla Project | బనకచర్లపై లోకేశ్​ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రుల కౌంటర్​

    Banakacherla Project | బనకచర్లపై లోకేశ్​ వ్యాఖ్యలకు తెలంగాణ మంత్రుల కౌంటర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Banakacherla Project | ఆంధ్రప్రదేశ్​ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్ట్​పై (Banakacharla project) తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ప్రాజెక్ట్​తో తెలంగాణ ప్రజలకు అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం పేర్కొంటుంది. ఈ క్రమంలో ఇటీవల బనకచర్లపై ఏపీ మంత్రి నారా లోకేశ్​ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి.

    మిగులు జలాలతో ప్రాజెక్ట్​ కడితే తెలంగాణకు అభ్యంతరం ఏమిటని ఆయన ప్రశ్నించారు. వృథాగా పోతున్న నీటినే తాము వాడుకుంటామని ఆయన అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్​కు (Kaleshwaram project) అనుమతులు ఉన్నాయా అని ప్రశ్నించారు. లోకేశ్​ వ్యాఖ్యలకు ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్​రావు కౌంటర్​ ఇచ్చారు. తాజాగా మంత్రులు పొన్నం, శ్రీధర్​బాబు ఆయన వ్యాఖ్యలపై స్పందించారు.

    READ ALSO  Telangana University | తెలంగాణ యూనివర్సిటీ అభివృద్ధి కాంగ్రెస్​తోనే సాధ్యం

    Banakacherla Project | చుక్క నీటిని కూడా వదులుకోం

    ఏపీ మంత్రి లోకేశ్​నికర, మిగులు, వరద జలాల గురించి తెలుసుకొని మాట్లాడాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ (Minister Ponnam Prabhakar) ఎద్దేవా చేశారు. ప్రాజెక్టుల నీటి వినియోగం పూర్తయితే వరద జలాలు లెక్కలోకి వస్తాయన్నారు. తెలంగాణకు రావాల్సిన నీటి వాటాలో చుక్క కూడా వదులుకోమని ఆయన స్పష్టం చేశారు. అసమానతలు రెచ్చగొడుతున్నారన్న లోకేశ్​ వ్యాఖ్యలు సరికాదని పేర్కొన్నారు.

    Banakacherla Project | బనకచర్లను వ్యతిరేకిస్తున్నాం

    బనకచర్ల ప్రాజెక్ట్​ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నట్లు మంత్రి శ్రీధర్​బాబు (Minister Sridhar Babu) తెలిపారు. కృష్ణా, గోదావరి నీటి వాటాలు తేల్చిన తర్వాతే కొత్త ప్రాజెక్టుల గురించి మాట్లాడుకోవాలన్నారు. ఏపీ మంత్రుల ప్రకటనలను పట్టించుకోబోమని ఆయన అన్నారు. కాళేశ్వరంపై నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

    READ ALSO  Nagarjuna Sagar | శాంతించిన కృష్ణమ్మ.. నాగార్జున సాగర్​ గేట్లు మూసివేత

    డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) సైతం శనివారం లోకేశ్​ వ్యాఖ్యలను ఖండించారు. తప్పుదారి పట్టించేలా లోకేశ్​ వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ అవసరాలు పూర్తయిన తర్వాతే బనకచర్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. గోదావరి జలాలను అక్రమంగా తరలించుకుపోయేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు.

    Latest articles

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...

    GP Secretaries | 15 మంది పంచాయతీ కార్యదర్శుల సస్పెన్షన్‌.. 47 మంది ఎంపీవోలకు నోటీసులు.. ఎందుకో తెలుసా?

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : GP Secretaries | ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 15 మంది పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్​ చేసింది....

    More like this

    Rural MLA Bhupathi Reddy | కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి సాధించాం..

    అక్షరటుడే, ఆర్మూర్: Rural MLA Bhupathi Reddy | రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక ఎంతో ప్రగతి...

    Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం..

    అక్షరటుడే, బాన్సువాడ: Minister Seethakka | కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్​ఛార్జి...

    Chevella | బర్త్​ డే పార్టీలో డ్రగ్స్​.. ఆరుగురు ఐటీ ఉద్యోగుల అరెస్ట్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Chevella | హైదరాబాద్​ (Hyderabad) నగరంలో డ్రగ్స్​ వినియోగం పెరిగిపోతోంది. పార్టీలు, పబ్​లు అంటూ...