HomeజాతీయంAir India | ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసరంగా ల్యాండింగ్​​ చేసిన పైలెట్​

Air India | ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం.. అత్యవసరంగా ల్యాండింగ్​​ చేసిన పైలెట్​

Air India | ఢిల్లీ నుంచి విశాఖకు బయలు దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలెట్ ఢిల్లీలోనే అత్యవసరంగా విమానాన్ని ల్యాండింగ్​ చేశాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Air India | ఎయిర్​ ఇండియా విమానంలో సాంకేతిక లోపం తెలెత్తింది. ఢిల్లీ (Delhi) నుంచి విశాఖకు బయలు దేరిన AI-451 విమానంలో సాంకేతిక లోపాన్ని పైలెట్​ గుర్తించాడు.

ఢిల్లీ విమానాశ్రయం (Delhi Airport) నుంచి ఎయిర్​ ఇండియా విమానం టేకాఫ్​ అయింది. అనంతరం పవర్​ షట్‌ డౌన్‌ అయినట్లు గుర్తించిన పైలట్‌ వెంటనే విమానాన్ని వెనక్కి మళ్లించాడు. దీంతో AI 451 తన ప్రయాణాన్ని రద్దు చేసుకుని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ల్యాండ్​ అయింది.

ఎయిర్ ఇండియా విమానం తన ప్రయాణాన్ని ప్రారంభించగానే సహాయక విద్యుత్ యూనిట్ (APU)లో ఒక లోపాన్ని సిబ్బంది గుర్తించారు. APU గాలిలోనే ఆటో-షట్‌డౌన్ అయింది. సిబ్బంది పునఃప్రారంభించడానికి ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలు ఫలించకపోవడంతో తిరిగి ఢిల్లీకి మళ్లించారు. అనంతరం విమానం సురక్షితంగా ల్యాండ్​ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు విమానాన్ని పరిశీలించారు.

Air India | ఆందోళన చెందుతున్న ప్రయాణికులు

రెండు రోజుల క్రితం ముంబై నుంచి నెవార్క్‌ (Newark) బయల్దేరిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానం చాలా సేపు గాలిలోనే చక్కర్లు కొట్టింది. అనంతరం ముంబైలోనే అత్యవసరంగా ల్యాండింగ్​ చేశారు. ఇటీవల విమానాల్లో సాంకేతిక లోపాలు తలెత్తుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad plane crash) జరిగిన తర్వాత ఇలాంటి వార్తలు ఎక్కువగా వస్తుండటంతో విమానంలో ఎక్కాలంటనే ప్రజలు ఆలోచిస్తున్నారు. ఎయిర్​లైన్స్​ సంస్థలు ముందుగానే విమానాలను చెక్​ చేసి ప్రయాణానికి అనువుగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలని కోరుతున్నారు.