ePaper
More
    Homeబిజినెస్​Tech Mahindra | టెక్‌ మహీంద్రా లాభాలు జంప్‌.. అయినా పడిపోయిన షేరు ధర

    Tech Mahindra | టెక్‌ మహీంద్రా లాభాలు జంప్‌.. అయినా పడిపోయిన షేరు ధర

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tech Mahindra | వివిధ పరిశ్రమలకు టెక్నాలజీ కన్సల్టింగ్‌(Technology Consulting), డిజిటల్‌ సొల్యూషన్స్‌ అందించే టెక్‌ మహీంద్రా ఈ ఏడాది జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికంలో మిశ్రమ ఫలితాలను వెలువరించింది. బలమైన లాభ వృద్ధి, డీల్‌ విన్స్‌ ఉన్నప్పటికీ అమెరికాలో అనిశ్చితులతో ఆదాయం తగ్గడంతో మార్కెట్‌ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో ఫలితాలు ప్రకటించిన తర్వాత షేరు ధర(Share Price) 2 శాతం వరకు పడిపోయింది.

    లార్జ్‌ క్యాప్‌(Large cap) కేటగిరికి చెందిన ఐటీ సెక్టార్‌ స్టాక్‌ అయిన టెక్‌ మహీంద్రా(Tech Mahindra) ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను బుధవారం ప్రకటించింది. ఈ త్రైమాసికంలో కంపెనీ నికర లాభం ఇయర్‌ ఆన్‌ ఇయర్‌(Year On Year) ప్రాతిపదికన 33.95 శాతం పెరిగి రూ. 1,140.6 కోట్లుగా నమోదయ్యింది. ఆపరేషన్స్‌నుంచి రెవెన్యూ(Revenue From Operations) 2.65 శాతం పెరిగి రూ. 13,351.2 కోట్లు రికార్డు చేసింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 13,005 కోట్లుగా ఉంది.

    READ ALSO  Patanjali | పతంజలి ఫుడ్స్‌ బంపర్‌ ఆఫర్‌.. ఒక్కో షేరుకు 2 షేర్లు ఫ్రీ!

    Tech Mahindra | యూఎస్‌ మార్కెట్‌లో తగ్గిన ఆదాయం..

    కంపెనీ మొత్తం టాప్‌లైన్‌(Top line)లో దాదాపు సగం వాటా ఉన్న అమెరికా మార్కెట్‌(America Market) నుంచి వచ్చే ఆదాయం గతేడాదితో పోలిస్తే 5.9 శాతం తగ్గింది. టెక్‌ మహీంద్రా కొత్త బుకింగ్‌ల విలువ 809 మిలియన్‌ డాలర్లకు పెరిగింది. గత క్వార్టర్‌లో వీటి విలువ 798 మిలియన్‌ డాలర్లు ఉంది. గత సంవత్సరం(Last year) ఇదే కాలంలో 534 మిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.
    టెక్‌ మహీంద్రా పనితీరు నిలకడగా పెరుగుతోందని కంపెనీ సీఈవో, మేనేజింగ్‌ డైరెక్టర్‌ మోహిత్‌ జోషి తెలిపారు. చివరి పన్నెండు నెలల ప్రాతిపదికన డీల్స్‌ 44 శాతం పెరిగాయన్నారు. అన్ని వెర్టికల్స్‌లో, అన్ని భౌగోళిక ప్రాంతాల్లో వృద్ధి కనిపిస్తోందన్నారు. వరుసగా ఏడు క్వార్టర్లలో మార్జిన్‌ విస్తరణను సాధించామని కంపెనీ చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌ రోహిత్‌ ఆనంద్‌ తెలిపారు. ఇది తమ సంస్థ అంతటా క్రమశిక్షణకు నిదర్శనమన్నారు.

    READ ALSO  Today Gold Price | త‌గ్గిన బంగారం ధ‌ర‌.. మ‌రి వెండి ప‌రిస్థితి ఏమిటంటే..

    Tech Mahindra | స్టాక్‌ పనితీరు..

    టెక్‌మహీంద్రా షేరు 52 వారాల గరిష్ట ధర రూ. 1,807.70 కాగా.. 52 వారాల కనిష్ట ధర రూ. 1,209.40 గా ఉంది. గత Trading సెషన్‌లో ఈ స్టాక్‌ ధర 1.7 శాతం పడిపోయి రూ. 1,607 వద్ద ఉంది. ఈ కంపెనీ ఇన్వెస్టర్ల(Investors)కు వారం రోజుల్లో సుమారు ఒక శాతం నష్టాన్ని, నెల రోజుల్లో 8 శాతం నష్టాన్ని అందించింది. ఏడాది కాలంలో 3 శాతం, ఐదేళ్లలో 163 శాతం లాభాలను ఇచ్చింది.

    Latest articles

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake embassy : నకిలీ ఠాణాలు, నకిలీ హాస్పిటల్స్, ఫేక్​ బ్యాంక్స్ ఇప్పటి వరకు చూశాం.....

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం...

    KCR KIT | కేసీఆర్ కిట్ కోసం కేటీఆర్​కు ట్వీట్.. తర్వాత ఏం జరిగిందంటే..?

    అక్షరటుడే, గాంధారి: KCR KIT | కేసీఆర్ కిట్ కోసం ఓ వ్యక్తి కేటీఆర్​కు (KTR) ట్వీట్ చేయడంతో,...

    More like this

    CM Revanth | ఫోన్​ ట్యాపింగ్​ చట్ట వ్యతిరేకం కాదు : సీఎం రేవంత్​ రెడ్డి

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్​ ట్యాపింగ్​...

    fake embassy | గుర్తింపు లేని దేశాలకు రాయబారి.. ప్రధాని, ప్రముఖులతో ఫొటోలు.. భారీ మోసానికి తెర లేపిన ఘనుడు..

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: fake embassy : నకిలీ ఠాణాలు, నకిలీ హాస్పిటల్స్, ఫేక్​ బ్యాంక్స్ ఇప్పటి వరకు చూశాం.....

    Anantapur | సాయం చేసిన గురువుకే పంగనామం.. ప్రియుడితో కలిసి బ్లాక్​మెయిల్​ చేసిన శిష్యురాలు

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Anantapur : గీతాగోవిందం Geeta Govindam Movie లో గురువును బెదిరించే శిష్యురాలు గుర్తుందా.. అచ్చం...