అక్షరటుడే, వెబ్డెస్క్: Ind vs Aus | ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ టాప్ ఆర్డర్ ఘోరంగా విఫలమైంది. చాలా రోజుల తర్వాత అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్ కోహ్లీ నిరాశ పరిచారు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా శనివారం ఉదయం పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ ఆరంభం అయింది. టాస్ గెలిచిన ఆసీస్ ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే భారత్ ఆదిలోనే వికెట్లు కోల్పోయింది. 13 పరుగుల వద్ద రోహిత్ శర్మ (8) అవుట్ అయ్యాడు. అనంతరం విరాట్ కోహ్లీ (Virat Kohli) సైతం డకవుట్ కాగా.. కెప్టెన్ గిల్ సైతం 10 పరుగులకే వెనుదిరిగాడు.
Ind vs Aus | ఆటంకం కలిగిస్తున్న వర్షం
భారత్–ఆసీస్ మ్యాచ్కు (India – Australia Match) వర్షం అంతరాయం కలిగిస్తోంది. ఇప్పటికే పలు మార్లు వర్షంతో మ్యాచ్ నిలిచిపోయింది. 25 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన తరుణంలో వర్షం పడడంతో మ్యాచ్ను నిలిపివేశారు. అనంతరం డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 32 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. అనంతరం వర్షం తగ్గడంతో మ్యాచ్ ఆరంభం అయింది. అయితే కొద్దిసేపటికే శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) (11) ఔట్ అయ్యాడు.
అనంతరం మళ్లీ వర్షం పడడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ప్రస్తుతం భారత్ 16.4 ఓవర్లలో 52 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉంది. అక్షర్ పటేల్ (14), కేఎల్ రాహుల్ (KL Rahul) క్రీజులో ఉన్నారు. ఇలాగే వర్షం అంతరాయం కలిగిస్తే మ్యాచ్ రద్దు అయ్యే అవకాశం ఉంది. దీంతో వరుణుడు భారత్ను కాపాడేనా అంటూ సోషల్ మీడియాలో నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఏడు నెలల తర్వాత వన్డే మ్యాచ్ ఆడుతున్న రోహిత్ శర్శ, విరాట్ కోహ్లీ విఫలం కావడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.