అక్షరటుడే, వెబ్డెస్క్: Teachers’ United Forum talks with AP government fail : ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో ప్రభుత్వంతో ఉపాధ్యాయ ఐక్యవేదిక చర్చలు విఫలం అయ్యాయి. దీంతో ఆందోళన కొనసాగిస్తామని ఉపాధ్యాయ సంఘాల నేతలు ప్రకటించారు.
సర్కారుతో సుమారు 8 గంటల పాటు ఉపాధ్యాయ ఐక్యవేదిక చర్చించింది. కానీ చివరికి ఇరువురి మధ్య సయోధ్య కుదరలేదు. దీంతో ఆందోళన కొనసాగిస్తామని సంఘాల నేతలు తెలిపారు.
ప్రభుత్వానికి రేపటి వరకు సమయం ఇస్తున్నామని చెప్పారు. తమ డిమాండ్లు పరిష్కరించకుంటే 21న డీఈవో కార్యాలయాలు(DEO offices) ముట్టడిస్తామని స్పష్టం చేశారు.