Homeజిల్లాలుకరీంనగర్Teacher Suspended | ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసెజ్​లు పంపిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్​ చేసిన అధికారులు

Teacher Suspended | ప్రభుత్వానికి వ్యతిరేకంగా మెసెజ్​లు పంపిన ఉపాధ్యాయుడు.. సస్పెండ్​ చేసిన అధికారులు

కరీంనగర్​ జిల్లా జమ్మికుంటలో పనిచేస్తున్న ఓ ఉపాధ్యాయుడిని అధికారులు సస్పెండ్ చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్​లో సందేశాలు పంపినందుకు ఆయనపై చర్యలు తీసుకున్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Teacher Suspended | ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాట్సాప్​లో మెసేజ్​లు (WhatsApp Massages) పంపుతున్న ఓ ఉపాధ్యాయుడికి అధికారులు షాక్​ ఇచ్చారు. విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టేలా ప్రేరేపిస్తున్నారని ఆయనపై సస్పెన్షన్​ వేటు వేశారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటు చేసుకుంది.

కరీంనగర్​ జిల్లా (Karimnagar district) జమ్మికుంట బాలికల ఎంపీపీఎస్​ పాఠశాలలో శ్రీనివాస్​ ఎస్జీటీగా పని చేస్తున్నాడు. ఆయన విద్యార్థులు, తల్లిదండ్రులను రెచ్చగొట్టే సందేశాలను పోస్ట్ చేస్తున్నారని, మధ్యాహ్న భోజనం (mid-day meal) వంటి ప్రభుత్వ పథకాల గురించి తప్పుడు వార్తలను వ్యాప్తి చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జమ్మికుంట ఎంఈవో ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

Teacher Suspended | నిజమని తేలడంతో..

ఉపాధ్యాయుడు శ్రీనివాస్​​ పాఠశాల, ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని విచారణలో తేలింది. అతను పాఠశాలలో వాయిస్, వీడియోను (voice and video) రికార్డ్ చేసేవాడని ఎంఈవో నివేదికలో పేర్కొన్నారు. ఉపాధ్యాయులను, ప్రధానోపాధ్యాయుడిని బెదిరించేవాడని తెలిపారు. CCA నియమాలు 1991, ప్రవర్తన నియమాలు 1964ను ఉల్లంఘించినందుకు ఆయనను సస్పెండ్​ చేస్తున్నట్లు కరీంనగర్​ డీఈవో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అయితే వాట్సాప్​లో ప్రభుత్వ వ్యతిరేక సందేశాలు పంపినందుకు ఓ ఉపాధ్యాయుడిని సస్పెండ్​ చేయడం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఈ వార్త సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది.

Must Read
Related News