Homeజిల్లాలుకామారెడ్డిEducation Department | సంతకాలు ఫోర్జరీ చేసిన ఉపాధ్యాయుడిని తొలగించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్​

Education Department | సంతకాలు ఫోర్జరీ చేసిన ఉపాధ్యాయుడిని తొలగించాలి: విద్యార్థి సంఘాల డిమాండ్​

క్రమం తప్పకుండా విధులు ఎగ్గొడుతూ ఫోర్జరీ సంతకాలు చేసి హాజరు వేసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడిని తక్షణమే సస్పెండ్​ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్​ చేశాయి. ఈ మేరకు కామారెడ్డి డీఈవో కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశాయి.

- Advertisement -

అక్షరటుడే, కామారెడ్డి: Education Department | విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఫోర్జరీ సంతకాలతో (signature forgery) హాజరు వేసుకుని జీతభత్యాలు పొందుతున్న టీచర్​ను తొలగించాలని విద్యార్థి సంఘాలు (Student unions) డిమాండ్​ చేశాయి.

ఈ మేరకు కామారెడ్డి పట్టణంలో (Kamareddy town) విద్యాశాఖ కార్యాలయంలో సంఘాల ప్రతినిధులు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ.. రాజంపేట మండలంలో ఆరెపల్లి తండా ప్రైమరీ పాఠశాలలో (Arepalli Thanda Primary School) ఓ ఉపాధ్యాయుడు విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించడంతో డీఈవో 2024 ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారని వివరించారు. సుమారు రెండునెలల తర్వాత మళ్లీ విధుల్లోకి తీసుకున్నారని.. దీనిని అదనుగా చేసుకొని ఆ ఉపాధ్యాయుడు తప్పుడు హాజరు పత్రాలను సృష్టించి సంతకాలను ఫోర్జరీ చేయగా విద్యాశాఖ అధికారులు గుర్తించి 2025 ఆగస్టు 12న మళ్లీ సస్పెండ్​ చేశారన్నారు.

మళ్లీ నెలన్నర రోజుల్లోనే తిరిగి విధుల్లోకి తీసుకున్నారని తెలిపారు. సదరు ఉపాధ్యాయుడు బాలాజీ పలుమార్లు సస్పెన్షన్లకు గురైనప్పటికీ.. మళ్లీ విధుల్లోకి తీసుకునేందుకు సహకరించిన సహ ఉపాధ్యాయులను, ఎంఈవోలు, డీఈవో కార్యాలయంలో సిబ్బందిపై కమిటీ వేసి విచారణ చేయాలని డిమాండ్​ చేశారు. సదరు ఉపాధ్యాయుడిని సర్వీస్ నుండి తొలిగించాలని కోరారు. కార్యక్రమంలో బీవీఎం రాష్ట్ర కార్యదర్శి జీవీఎం విఠల్, ఎన్ఎస్​యూఐ జిల్లా అధ్యక్షుడు ఐరేని సందీప్ కుమార్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ముదాం అరుణ్ కుమార్ పాల్గొన్నారు.