అక్షరటుడే, బోధన్ : Bodhan | బోధన్ (Bodhan) పట్టణంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో టాస్క్ఫోర్స్ పోలీసులు (Taskforce) సోమవారం దాడులు చేశారు. అనిల్ టాకీస్ రోడ్డు, అంబేడ్కర్ చౌరస్తా ప్రాంతంలోని షాపుల్లో తనిఖీలు చేశారు. పలు దుకాణాల్లో కాలం చెల్లిన మందులను గుర్తించినట్లు సమాచారం. టాస్క్ఫోర్స్ సీఐ అంజయ్య, ఎస్సై భాస్కర్చారి నేతృత్వంలో దాడులు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
