అక్షరటుడే, వెబ్డెస్క్ : Tamil Nadu Stampede | తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సినీ నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్ శనివారం రాత్రి నిర్వహించిన భారీ ప్రచార ర్యాలీలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 31కి చేరుకున్నట్లు స్థానిక పోలీసు అధికారులు ప్రకటించారు.
విజయ్ (Vijay) కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టిన విషయం తెలిసిందే. కాగా, అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో ఆయన ప్రకటించారు.
ఈ మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా కరూర్ (Karur)లో శనివారం భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున విజయ్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది.
Tamil Nadu Stampede | భారీగా ప్రజలు తరలి రావడంతో..
ప్రచార ర్యాలీకి భారీగా జనాలు తరలి రావడంతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. పలువురు చిన్నారులు, పార్టీ కార్యకర్తలు ఈ ఘటనలో గాయపడ్డారు.
తొక్కిసలాట ఘటన నేపథ్యంలో విజయ్ తన ప్రసంగాన్ని ఆపేశారు. బాధితులను అంబులెన్స్ల్లో ఆస్పత్రులకు తరలించారు.
Tamil Nadu Stampede | సీఎం స్టాలిన్ తక్షణ చర్యలు..
కరూర్ ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్ (CM Stalin) స్పందించారు. స్థానిక కలెక్టర్తో మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సాయం ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఏడీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ ఘటనా స్థలికి చేరుకున్నారు.