HomeజాతీయంTamil Nadu road accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అయ్యప్ప భక్తుల...

Tamil Nadu road accident | తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం!

Tamil Nadu road accident : తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు. 

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామనాథపురం వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఐదుగురు అయ్యప్ప భక్తులు దుర్మరణం చెందారు.

ఎదురెదురుగా రెండు కార్లు ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఈ దారుణ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరణించిన వారంతా ఆంధ్రప్రదేశ్​కు చెందిన చెందిన అయ్యప్ప స్వామి భక్తులుగా తమిళనాడు పోలీసులు నిర్ధారించారు.

Tamil Nadu road accident | రామేశ్వం వెళ్తుండగా..

అయ్యప్ప భక్తులు రామేశ్వరం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురైనట్లు సమాచారం. ప్రమాద తీవ్రత వల్ల రెండు కార్ల ముందు భాగాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ రెండు కార్లలో ఒకటి ఏపీకి చెందినదిగా గుర్తించారు.

ఈ కారులోనే అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఇక మరో కారు ఐరావడి వైపు వెళ్తూ.. కీఝక్కరై సమీపంలో ఏపీ కారును ఢీ కొంది. రెండు కార్లలో 12 మంది ఉన్నట్లు తెలిసింది.

Must Read
Related News