అక్షరటుడే, వెబ్డెస్క్: Afghan attack on Pakistan | పాకిస్థాన్పై ఆఫ్ఘనిస్థాన్ ప్రతీకార దాడికి దిగింది. ఉత్తర సరిహద్దులోని పర్వత ప్రాంతాలలో ఉన్న పాకిస్థాన్ దళాలపై దాడి చేసినట్లు తాలిబన్ సర్కారు ప్రకటించింది.
పాకిస్థాన్లోని 27 సైనిక స్థావరాలపై తాలిబన్లు Taliban దాడి చేసినట్లు ట్విటర్ (Twitter) లో పోస్టులు మారుమోగుతున్నాయి. 12 మంది పాక్ సైనికులను హతమార్చినట్లు అఫ్ఘాన్ ప్రకటించింది. పాకిస్థాన్ – ఆఫ్ఘనిస్థాన్ మధ్య సరిహద్దుగా ఉన్న డ్యూరాండ్ రేఖ వెంబడి ఈ దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
ఆఫ్ఘనిస్థాన్లో ఇటీవల జరిగిన పాక్ సైనిక చర్యలకు తాలిబన్లు చేసిన ప్రతిస్పందనగా ఈ ఘర్షణ జరిగిందని భావిస్తున్నారు.
“కునార్, హెల్మండ్ ప్రావిన్సులలో డ్యూరాండ్ రేఖ (Durand Line) వెంబడి పాకిస్తాన్ సైన్యం నుంచి అనేక అవుట్పోస్టులను తాలిబన్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి” అని అఫ్ఘాన్ రక్షణ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
Afghan attack on Pakistan | రెండు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత
ఆఫ్ఘనిస్థాన్ Afghanistan – పాకిస్థాన్ Pakistan మధ్య ఇటీవల ఉద్రిక్తతలు పెరిగాయి. అక్టోబరు 9న, ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రావిన్సులలో పాక్ వైమానిక దాడులు చేపట్టింది. ఆ గ్రూపు నాయకుడు నూర్ వాలి మెహ్సుద్తో సహా తెహ్రిక్-ఇ-తాలిబన్ పాకిస్తాన్ (TTP) సీనియర్ కమాండర్లను లక్ష్యంగా చేసుకుంది.
వైమానిక దాడులకు ప్రతిస్పందనగా, ఆఫ్ఘాన్ దళాలు డ్యూరాండ్ రేఖ సమీపంలోని పాక్ సైనిక పోస్టులను లక్ష్యంగా చేసుకుని ఎదురుదాడికి దిగింది. నంగర్హార్, కునార్ ప్రావిన్సులలోని అనేక పాక్ అవుట్పోస్టులను ఆఫ్ఘాన్ దళాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో పాక్ సైనిక ఉనికికి గణనీయమైన దెబ్బ తగిలిట్లు అయింది.
“కాబూల్ Kabul పై పాక్ సైన్యం నిర్వహించిన వైమానిక దాడులకు ప్రతీకారంగా.. తాలిబాన్ దళాలు సరిహద్దు వెంబడి వివిధ ప్రాంతాలలో పాక్ భద్రతా దళాలపై దాడులకు దిగినట్లు అఫ్ఘాన్ సైన్యం ఒక ప్రకటనలో తెలిపింది.
భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి ముత్తాకి
తాలిబన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి ఎనిమిది రోజుల భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ తాజా దాడి జరిగింది.
ఢిల్లీ నుంచి తన ప్రతినిధి బృందంతో రోడ్డు మార్గంలో ప్రయాణించిన ముత్తాకిని, దారుల్ ఉలూమ్ వైస్-ఛాన్సలర్ ముఫ్తీ అబుల్ ఖాసిం నోమానీ, జమియత్ ఉలామా-ఎ-హింద్ అధ్యక్షుడు మౌలానా అర్షద్ మదానీ, ఇతర అధికారులు పూలమాలల వర్షం మధ్య స్వాగతించారు. భద్రతా సిబ్బంది కఠినమైన ప్రొటోకాల్లను పాటించినప్పటికీ, వందలాది మంది విద్యార్థులు, ప్రజలు సెమినరీ వద్ద ఆయనను పలకరించడానికి గుమిగూడారు.
విలేకరులతో ముత్తాకి మాట్లాడుతూ.. ఇంత గొప్ప స్వాగతం, ఇక్కడి ప్రజలు చూపిన ఆప్యాయతకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భారత్ – ఆఫ్ఘనిస్థాన్ సంబంధాలు మరింత ముందుకు సాగాలని నేను ఆశిస్తున్నాను..” అని అన్నారు.