అక్షరటుడే, బీర్కూరు: మండల కేంద్రలో హైదరాబాద్ మున్నూరు కాపు ట్రస్ట్ (Munnuru Kapu Trust) ఆధ్వర్యంలో ప్రతిభచూపిన కాపు విద్యార్థులకు శనివారం పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా పదో తరగతి, ఇంటర్లో 90 శాతం మార్కులకుపైగా సాధించిన ప్రతిభావంతులైన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, గోల్డ్మెడల్స్తో (Gold medals) పాటు రూ.2,000 నగదు పురస్కారాలను అందజేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రిటైర్డ్ ఉపాధ్యాయులు మేకల విఠల్ మాట్లాడుతూ.. మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించాలని అన్నారు. ట్రస్ట్ ప్రతినిధులు మాట్లాడుతూ.. 20ఏళ్లుగా వెనుకబడిన మున్నూరు కాపు కుటుంబాలకు విద్యా రంగంలో సహాయ కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు చదువు కొనసాగించేందుకు చేయూతనిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ ఛైర్మన్ యామ రాములు, సొసైటీ ఛైర్మన్ ఇంగురాములు, ఉపాధ్యాయులు కంఠం శ్రీనివాస్, నారం వెంకటి, సత్యం, మద్దూర్ నర్సింలు, మేకల గాలయ్య, మేకల సురేష్, లాడేగమ గంగాధర్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.