అక్షరటుడే, ఇందూరు : Taekwondo Competitions | జాతీయ తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ఉత్తమ ప్రతిభతో పతకాలు సాధించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భరత లక్ష్మి (Judge Bharat Lakshmi) అన్నారు. ఎంపికైన జిల్లా క్రీడాకారులు సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు.
తైక్వాండో పోటీలకు (Taekwondo Competitions) జిల్లా క్రీడాకారులు సిద్ధార్థ, భవ్య, సాయి ప్రసన్న, అనన్య, అభిరాం, సాయి దీక్షితులు ఎంపికైనట్లు అసోసియేషన్ కార్యదర్శి మనోజ్ కుమార్ తెలిపారు. జాతీయస్థాయి పోటీలు (National Level Competitions) పంజాబ్లోని జలంధర్లో ఈనెల 20 నుంచి 23వ తేదీ వరకు జరుగనున్నట్లు ఆయన పేర్కొన్నారు.
