Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | చికిత్స పొందుతూ యువకుడి అనుమానాస్పద మృతి

Nizamabad City | చికిత్స పొందుతూ యువకుడి అనుమానాస్పద మృతి

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad City | నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ యువకుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. వర్ని (Varni) మండలం సిద్ధాపూర్ (Siddapur)​ గ్రామానికి చెందిన యువకుడు కెతావత్​ భాస్కర్​(19)కు వెన్నునెప్పితో బాధపడుతున్నాడు. దీంతో శనివారం ఉదయం ఒకటో టౌన్​ పరిధిలోని ఓ​ ప్రైవేట్​ ఆస్పత్రిలో (Private Hospital) స్పైన్​ సర్జరీ నిమిత్తం చేరాడు.

ఆపరేషన్​కు సిద్ధమైన వైద్యుడు యువకుడికి సర్జరీ చేసే క్రమంలో అనస్థీషియా(Anesthesia) ఇచ్చారు. అనంతరం సదరు యువకుడి మృతి చెందాడు. కాగా.. అనస్థీషియా డోస్​ ఎక్కువ కాడంతో యువకుడు మృతి చెందాడని మృతుడి కుటుంబీకులు ఆరోపించారు. సీపీఆర్ (CPR)​ చేసినప్పటికీ ప్రాణాలు దక్కలేదని.. వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడు మృతి చెందాడని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా బాధితులు ఆస్పత్రి ఆవరణలో ఆందోళనకు దిగారు. మృతుడు కెతావత్​ భాస్కర్​కు ఇటీవలే ఐఐటీ మద్రాస్​లో సీటు కూడా వచ్చింది. అంతలోనే ఈ ఘోరం జరిగిందని బాధితులు రోధించారు.