ePaper
More
    HomeతెలంగాణRevanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    Revanth meet Nirmala | కళాశాలల్లో అత్యాధునిక ల్యాబ్​ల ఏర్పాటుకు రూ. 9 వేల కోట్లు..!

    Published on

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌ కృషికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మ‌లా సీతారామ‌న్​ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు.

    తెలంగాణ‌లో సుమారు 90 శాతంగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వ‌ర్గాల్లోని పిల్ల‌ల‌కు కార్పొరేట్ త‌ర‌హా విద్య‌ను అందించేందుకు త‌మ ప్ర‌భుత్వం తీసుకుంటున్న చ‌ర్య‌ల‌ను కేంద్ర మంత్రికి వివ‌రించారు.

    ఢిల్లీ నార్త్ బ్లాక్​లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రితో ముఖ్యమంత్రి స‌మావేశ‌మ‌య్యారు. రాష్ట్రంలోని 105 శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను నిర్మించ‌నున్న‌ట్లు తెలిపారు.

    ఇప్ప‌టికే నాలుగు పాఠ‌శాల‌ల నిర్మాణ ప‌నులు మొద‌ల‌య్యాయ‌ని, మిగ‌తా పాఠ‌శాల‌ల‌కు సంబంధించి టెండ‌ర్లు ముగిశాయ‌న్నారు.

    ఒక్కో పాఠ‌శాల‌లో 2,560 మంది విద్యార్థులు ఉంటార‌ని, 2.70 ల‌క్ష‌ల మంది విద్యార్థుల‌కు ఈ పాఠ‌శాల‌ల్లో చదువుకునే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని ముఖ్యమంత్రి వివ‌రించారు.

    Revanth meet Nirmala : ల్యాబ్​ల కోసం రూ. 9 వేల కోట్లు

    అత్యాధునిక వ‌స‌తులు, ల్యాబ్‌లు, స్టేడియాలతో నిర్మించే ఈ 105 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రూ.21 వేల కోట్ల వ్య‌య‌మ‌వుతుంద‌ని వివ‌రించారు.

    రాష్ట్రంలో జూనియ‌ర్‌, డిగ్రీ, సాంకేతిక క‌ళాశాలలు, ఇత‌ర ఉన్న‌త విద్యా సంస్థ‌ల్లో ఆధునిక ల్యాబ్‌లు, ఇత‌ర మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌కు రూ.9 వేల కోట్లు వెచ్చించ‌నున్న‌ట్లు కేంద్ర మంత్రికి సీఎం తెలిపారు.

    ఈ నిధుల స‌మీక‌ర‌ణ‌ నిమిత్తం ప్ర‌త్యేక కార్పొరేష‌న్ ఏర్పాటుకు అనుమ‌తించ‌డంతో పాటు ఎఫ్ఆర్‌బీఎం ప‌రిమితి నుంచి మిన‌హాయించాల‌ని నిర్మ‌లా సీతారామ‌న్​కు ముఖ్యమంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యా రంగంపై చేస్తున్న వ్య‌యాన్ని పెట్టుబ‌డిగా ప‌రిగ‌ణించాల‌ని కోరారు.

    గ‌త ప్ర‌భుత్వంలో అధిక వ‌డ్డీల‌కు అప్పులు తీసుకువ‌చ్చారని, వాటి చెల్లింపు రాష్ట్ర ప్ర‌భుత్వానికి భారంగా మారిన నేప‌థ్యంలో వాటి రీస్ట్ర‌క్చ‌రింగ్‌కు అనుమ‌తించాల‌ని కోరారు. ముఖ్య‌మంత్రి చేసిన విజ్ఞ‌ప్తుల‌పై నిర్మ‌లా సీతారామ‌న్ సానుకూలంగా స్పందించారు.

    ముఖ్యమంత్రితో పాటు కేంద్ర మంత్రిని కలిసిన వారిలో ఎంపీలు డాక్ట‌ర్ మ‌ల్లు ర‌వి, పోరిక బ‌ల‌రాం నాయ‌క్‌, సురేశ్ షెట్కార్‌, చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డితో పాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు ఉన్నారు.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...