Pakistan | పాక్​ పారా మిలిటరీ కార్యాలయంపై ఆత్మహుతి దాడులు.. ఆరుగురి మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | పాకిస్థాన్​లోని పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆత్మహుతి దాడులు చేపట్టడంతో పాటు, కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పాక్​లోని పెషావర్ ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై (Paramilitary Headquarters) సోమవారం ఉదయం దాడి జరిగింది. రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు పాక్​ మీడియా తెలిపింది. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థాన్ కమాండర్లు […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Pakistan | పాకిస్థాన్​లోని పారా మిలిటరీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఆత్మహుతి దాడులు చేపట్టడంతో పాటు, కాల్పులు జరిపారు. దీంతో ఆరుగురు మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.

పాక్​లోని పెషావర్ ఫ్రాంటియర్ కోర్ ప్రధాన కార్యాలయంపై (Paramilitary Headquarters) సోమవారం ఉదయం దాడి జరిగింది. రెండు శక్తివంతమైన పేలుళ్లు చోటు చేసుకున్నట్లు పాక్​ మీడియా తెలిపింది. అనంతరం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ముగ్గురు పాకిస్థాన్ కమాండర్లు (Pakistani Commanders) సహా ఆరుగురు చనిపోయారు. ఇద్దరు ఉగ్రవాదులు కాల్పులు జరిపినట్లు అధికారులు గుర్తించారు.

మొదట ఫ్రాంటియర్‌ కోర్‌ ప్రధాన కార్యాలయం గేట్ వద్ద పేలుడు చోటు చేసుకుంది. అనంతరం సమీపంలోని సైకిల్‌ స్టాండ్‌ వద్ద మరో పేలుడు సంభవించింది. సహాయక బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నాయి. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. FC ప్రధాన కార్యాలయంపై దాడి జరిగిందని, తాము ప్రతిస్పందిస్తున్నామని పోలీసు అధికారి మియాన్ సయీద్ అహ్మద్ చెప్పినట్లు పాకిస్తాన్ (Pakistan) వార్తా సంస్థలు తెలిపాయి.

ఈ సంవత్సరం ప్రారంభంలో క్వెట్టాలోని పారామిలిటరీ ప్రధాన కార్యాలయం వెలుపల శక్తివంతమైన కారు బాంబు పేలుడు చోటు చేసుకుంది. సెప్టెంబర్ 3న, క్వెట్టాలో జరిగిన రాజకీయ ర్యాలీలో జరిగిన ఆత్మాహుతి దాడిలో 11 మంది మరణించారు. కాగా ఈ దాడికి ఏ సంస్థ ఇంకా బాధ్యత వహించలేదు. అయితే గత కొంతకాలంగా పాక్​ సైనికులే లక్ష్యంగా బలూచిస్థాన్​ లిబరేషన్​ ఆర్మీ (Balochistan Liberation Army) దాడులకు పాల్పడుతోంది. బీఎల్​ఏ దాడుల్లో గతేడాది 782 మంది చనిపోయారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 430 మందికి పైగా భద్రతా సిబ్బంది మరణించారు.

Related articles

TGSRTC app ticket booking | ప్రయాణికులకు గుడ్​న్యూస్​.. యాప్​లో ఆర్టీసీ బస్సు టికెట్లు బుక్​ చేసుకోవచ్చు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSRTC app ticket booking | ఆర్టీసీ బస్సుల్లో యాప్​ ద్వారా టికెట్లు బుక్​ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం ప్రవేశ...

HYDRAA land protection | రూ.100 కోట్ల పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

అక్షరటుడే, వెబ్​డెస్క్ : HYDRAA land protection | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో ఆక్రమణలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతంది. వందల కోట్ల విలువైన ప్రభుత్వ,...

Congress Warning to Rakesh | రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకో..: కాంగ్రెస్ నాయకుల హెచ్చరిక

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు.

Road Safety Awareness Program | ట్రాఫిక్​ నిబంధనలపై అవగాహన ఉండాలి : సీపీ సాయి చైతన్య

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం : Road Safety Awareness Program | సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య...