Homeఆంధప్రదేశ్Ponnam Prabhakar | తనిఖీలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు.. బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం

Ponnam Prabhakar | తనిఖీలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు.. బస్సు ప్రమాదంపై మంత్రి పొన్నం

కర్నూల్​ బస్సు ప్రమాద ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్​ స్పందించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపడుతామని పేర్కొన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ ​: Ponnam Prabhakar | కర్నూల్​ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి స్పందించారు. ప్రైవేట్​ బస్సుల తనిఖీలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరీ ట్రావెల్స్‌ (Vemuri Kaveri Travels) కు చెందిన వోల్వో బస్సు కర్నూల్​ జిల్లా చిన్నటేకూరు సమీపంలో కాలిపోయిన విషయం తెలిసిందే. బస్సు బైక్​ను ఢీకొనడంతో మంటలు వ్యాపించి 20 మంది ప్రయాణికులు చనిపోయారు. ఈ ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్​ (Prabhakar) మాట్లాడుతూ.. తనిఖీలు లేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని చెప్పారు. బస్సులను రోజూ తనిఖీ చేస్తుంటే ట్రావెల్స్​ యజమానులు వేధింపులు అంటున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రమాదంపై ఏపీ రవాణా శాఖ మంత్రి, కర్నూలు కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

Ponnam Prabhakar | సమగ్ర విచారణ

భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. త్వరలో ఏపీ, కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ కమిషనర్ల సమావేశం నిర్వహిస్తామన్నారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రైవేట్​ బస్సుల స్పీడ్​ నియంత్రణ కోసం చర్యలు చేపడుతామన్నారు. ప్రైవేట్​ ట్రావెల్స్ (Private Travels)​ మధ్య అనారోగ్యకర పోటీ ఉందన్నారు. దానిని నివరిస్తామని ఆయన చెప్పారు. మృతుల వివరాలు తెలిశాక రాష్ట్ర ప్రభుత్వం (State Government) తరఫున ఆర్థిక సహాయం అందిస్తామన్నారు.

Ponnam Prabhakar | నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

ప్రైవేట్​ ట్రావెల్స్​ యాజమానులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పొన్నం హెచ్చరించారు. ఫిట్‌నెస్, ఇన్సూరెన్స్ విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించిన ఊరుకోమన్నారు. యజమానుల నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే హత్య నేరం కింద కేసులు పెడతామని హెచ్చరించారు.