Gadugu Gangadhar | సంక్రాంతికి సబ్సిడీపై యంత్ర పరికరాలు : గడుగు గంగాధర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadugu Gangadhar | రాష్ట్ర ప్రభుత్వం (State Government) వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రైతు కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​ అన్నారు. రెండేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందిస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డిని (CM Revanth Reddy) అసెంబ్లీలోని ఆయన ఛాంబర్​లో కలిశామన్నారు. రైతు కమిషన్​ […]

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gadugu Gangadhar | రాష్ట్ర ప్రభుత్వం (State Government) వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని రైతు కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​ అన్నారు. రెండేళ్లలో రూ.లక్ష కోట్లకు పైగా నిధులను వ్యవసాయ రంగానికి ఖర్చు చేసినట్లు తెలిపారు.

రాష్ట్రంలో సంక్రాంతి నుంచి సబ్సిడీపై వ్యవసాయ పరికరాలను రైతులకు అందిస్తామన్నారు. వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇటీవల సీఎం రేవంత్​రెడ్డిని (CM Revanth Reddy) అసెంబ్లీలోని ఆయన ఛాంబర్​లో కలిశామన్నారు. రైతు కమిషన్​ సీఎంతో అనేక విషయాలపై చర్చిందని తెలిపారు. కమిషన్​ పనితీరుపై సీఎం సంతృప్తి వ్యక్తం చేశారనన్నారు. అవసరం అయితే అదనపు నిధులు ఇస్తామని హామీ ఇచ్చారన్నారు.

Gadugu Gangadhar | రైతులకు అవగాహన

రైతు కమిషన్​ (Rythu Commission) ఆధ్వర్యలో రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేపట్టి పంట మార్పిడిపై అవగాహన కల్పించామని గడుగు గంగాధర్​ తెలిపారు. రాష్ట్రంలో ఉద్యానవన పంటల సాగు, తృణధాన్యాలు, పప్పుదినుసుల సాగు పెంచేలా చర్యలు చేపడుతామన్నారు. చెరుకు, పసుపు, బత్తాయి సాగు విస్తీర్ణం పెంచేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుందన్నారు.

Related articles

Stock Market Gains | లాభాల బాటలో మార్కెట్లు..

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల బాటలో సాగుతున్నాయి. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 313 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో ఉన్నాయి.

Kamareddy Chairperson | కామారెడ్డి ఛైర్​పర్సన్​గా ఉమారాణి బాధ్యతల స్వీకరణ.. భారీ బందోబస్తు

కామారెడ్డి మున్సిపల్​ ఛైర్​పర్సన్​గా ఉమారాణి సోమవారం బాధ్యతలు తీసుకోనున్నారు. దీంతో పోలీసులు పట్టణంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Mexico Cartel Violence | డ్రగ్స్​ డాన్​ హతం.. మెక్సికోలో చెలరేగిన హింస

మెక్సికోలో హింస చెలరేగింది. డ్రగ్స్​ వ్యాపారిని పోలీసులు హతమార్చడంతో కార్టెల్స్​ ప్రతీకార దాడులకు దిగారు.

Telangana Cabinet Meeting | నేడు తెలంగాణ కేబినెట్​ భేటీ.. రైతు భరోసాపై ప్రకటన వచ్చేనా

రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నేడు జరగనుంది. రైతు భరోసా, బడ్జెట్ సమావేశాల గురించి చర్చించనున్నారు.