Flight Journey
Flight Journey | విమాన ప్రయాణం చేసిన విద్యార్థులు..ఎందుకంటే..

అక్షరటుడే, కామారెడ్డి: Flight Journey | పదో తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భిక్కనూరు మండలానికి చెందిన ఆరుగురు విద్యార్థులకు భిక్కనూరుకు చెందిన ఇన్​స్పెక్టర్​ మల్లేష్ inspector mallesh ​విమాన ప్రయాణ అవకాశం కల్పించారు.

భిక్కనూరులో పుట్టిపెరిగిన గడ్డం మల్లేష్ జీడిమెట్ల పోలీస్​స్టేషన్లో ఇన్​స్పెక్టర్​గా పని చేస్తున్నారు. ఆయన సతీమణి సుశీల కెమిస్ట్రీ లెక్చరర్. అయితే భిక్కనూరు ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకున్న మల్లేష్​.. సర్కారు పాఠశాలల్లో ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సంకల్పించారు.

జడ్పీహెచ్​ఎస్​ బాలుర పాఠశాల నుంచి ఇద్దరు, బాలికల పాఠశాల నుంచి ఇద్దరు, జంగంపల్లి పాఠశాల నుంచి ఇద్దరిని బెంగుళూరు తీసుకెళ్లారు. అక్కడ విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రాన్ని సందర్శించడంతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాల్ని వారికి చూపించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు స్ఫూర్తినివ్వాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టామని సుశీల మల్లేష్​ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు సహస్ర, స్పందన, వంశిక, సహస్ర, నౌసేన్, మహేష్ ఉన్నారు.