Homeజిల్లాలుకామారెడ్డిYellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని.. రోడ్డెక్కిన విద్యార్థినులు

Yellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని.. రోడ్డెక్కిన విద్యార్థినులు

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Yellareddy | పురుగుల అన్నం పెడుతున్నారని నిరసిస్తూ విద్యార్థినులు(Students) ఆందోళనకు దిగారు. ఎల్లారెడ్డి గిరిజన బాలికల గురుకుల పాఠశాల విద్యార్థినులు సోమవారం ఎల్లారెడ్డి – బాన్సువాడ ప్రధాన రహదారిపై భైఠాయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నం తినేటప్పుడు తరచుగా పురుగులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై పలుమార్లు ప్రిన్సిపల్, అధ్యాపకుల దృష్టికి తీసుకు వెళ్లినప్పటికీ వారు ఏమాత్రం పట్టించుకోవడంలేదని వాపోయారు.

Yellareddy | తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డెక్కాం..

విధిలేని పరిస్థితుల్లో తాము రోడ్డెక్కి నిరసన తెలుపుతున్నామని విద్యార్థినులు పేర్కొన్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. విద్యార్థినుల నిరసనతో ఎల్లారెడ్డి – బాన్సువాడ(Yellareddy Banswada) ప్రధాన రహదారిపై వాహనాలు భారీగా నిలిచిపోయాయి. ఎల్లారెడ్డి తహశీల్దార్ ప్రేమ్ కుమార్(Yellareddy Tahsildar Prem Kumar) రోడ్డుపై భైఠాయించిన విద్యార్థినులతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనను విరమించారు.

Yellareddy | పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్​..

అనంతరం గిరిజన బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్(రెవెన్యూ) విక్టర్(Additional Collector Victor) పాఠశాలను సందర్శించారు. విద్యార్థినుల రాస్తారోకో విషయాన్ని తెలుసుకున్న ఆయన పాఠశాలకు వచ్చారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో మాట్లాడారు. పాఠశాలలోని డైనింగ్ హాల్, స్టాక్ రూమ్, వాష్ రూమ్​లను పరిశీలించారు. విద్యార్థుల సమస్యలను సావధానంగా విన్న ఆయన త్వరలోనే పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తహశీల్దార్​ ప్రేమ్ కుమార్, మున్సిపల్ కమిషనర్ మహేష్, ఎంఈవో రాజులు తదితరులు పాల్గొన్నారు.

Read all the Latest News on Aksharatoday.in