ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Mla Rakesh reddy | విద్యార్థులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    Mla Rakesh reddy | విద్యార్థులు ధైర్యంగా ఉండాలి: ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    Published on

    అక్షరటుడే, ఆర్మూర్‌: Mla Rakesh reddy | విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండేలా ఉపాధ్యాయులు వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహించాలని ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి సూచించారు. పట్టణంలోని పిప్రి రోడ్‌లో (Pipri road) వేల్పూర్‌ సాంఘిక సంక్షేమ వసతిగృహాన్ని (Velpur Social Welfare Hostel) ఆయన సోమవారం పరిశీలించారు. రెండు రోజుల క్రితం వసతిగృహంలో ఉంటున్న ఇంటర్‌ విద్యార్థి గడ్డం సంతోష్‌ ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలను ఉపాధ్యాయులు, సిబ్బందిని ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు.

    Mla Rakesh reddy | సౌకర్యాల విషయమై ఆరా..

    వసతిగృహంలో ఉపాధ్యాయుల హాజరు పట్టిక​ను ఎమ్మెల్యే పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఏమైనా సమస్యలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. విద్యార్థులతో మాట్లాడుతూ.. ఏ సమస్య వచ్చినా ధైర్యంగా ఉండాలని సూచించారు. ఉన్నతాధికారులకు సమస్యను తెలిపితే పరిష్కార మార్గాలు తెలియజేస్తారని వివరించారు. ఆయన వెంట బీజేపీ నాయకులు బాలు, గంధం నవీన్, పాన్‌ శ్రీను, ఉదయ్‌ గౌడ్, కలిగోట ప్రశాంత్, అధికారులున్నారు.

    అధికారులతో చర్చిస్తున్న ఎమ్మెల్యే రాకేష్​ రెడ్డి

    More like this

    Revanth meet Nirmala | విద్యా రంగంలో మార్పుల ప్రయత్నానికి మద్దతు ఇవ్వరూ.. నిర్మలా సీతారామన్​ను కోరిన రేవంత్​

    అక్షరటుడే, హైదరాబాద్: Revanth meet Nirmala : తెలంగాణ విద్యా రంగంలో స‌మూల‌ మార్పులు తేవ‌డానికి తాము చేస్తున్న‌కృషికి...

    Nara Lokesh | కేటీఆర్​ను కలిస్తే తప్పేంటి.. ఏపీ మంత్రి లోకేష్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nara Lokesh | మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్ (KTR)​ను కలిస్తే...

    Kamareddy | తల్లికి తలకొరివి పెట్టేందుకు కొడుకు వస్తే వెళ్లగొట్టిన గ్రామస్థులు.. ఎందుకో తెలుసా..?

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | తల్లిని కంటికి రెప్పలా కాపాడుకొని ఆసరాగా ఉండాల్సిన కొడుకు ఇరవై ఏళ్ల క్రితం...