Homeజిల్లాలునిజామాబాద్​CPR | సీపీఆర్​పై విద్యార్థులకు అవగాహన ఉండాలి

CPR | సీపీఆర్​పై విద్యార్థులకు అవగాహన ఉండాలి

సీపీఆర్​పై ప్రతిఒక్కరికీ అవగాహన ఉండాలని ప్రభుత్వ వైద్యురాలు హసీనా అన్నారు. ఈ మేరకు కమ్మర్​పల్లి ప్రభుత్వ జూనియర్​ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

- Advertisement -

అక్షరటుడే, కమ్మర్​పల్లి : CPR | సీపీఆర్​పై విద్యార్థులకు తప్పనిసరిగా అవగాహన ఉండాలని ప్రభుత్వ వైద్యురాలు హసీనా సూచించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం విద్యార్థులకు సీపీఆర్​పై (Cardio Pulmonary Resuscitation) అవగాహన కల్పించారు.

విద్యార్థులకు ప్రాక్టికల్​గా సీపీఆర్ (CPR) ఏవిధంగా చేయాలో చేసి చూపించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అయోడిన్ కొరత వల్ల థైరాయిడ్ సమస్యలు (Thyroid Problems) వస్తాయని వివరించారు. అయోడైజ్డ్​​ ఉప్పును వాడాలని సూచించారు. ఇది పిల్లల్లో పెరుగుదలకు దోహదపడుతుందన్నారు. రోజూ ఐదు గ్రాముల కంటే ఎక్కువ ఉప్పు తీసుకోవద్దని చెప్పారు.

ఎవరైనా గుండెపోటుకు గురయితే సరైనా సమయంలో స్పందించి సీపీఆర్​ చేయడం వల్ల ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడినట్లు అవుతుందని డాక్టర్ వివరించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జయపాల్ రెడ్డి, అధ్యాపకులు మధు, రాజకుమార్, వైష్ణవి, గంగాధర్​, మహేందర్, శ్రీహరి, మురళీకృష్ణ, గంగారాం, హాస్పిటల్ సూపర్​వైజర్​ పద్మలత, ఏఎన్ఎంలు స్వరూప, కృష్ణవేణి పాల్గొన్నారు.