Kamareddy | కొత్తస్కూల్​ భవనం కోసం విద్యార్థుల రాస్తారోకో..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (kamareddy Municipality) పరిధిలోని రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది. Kamareddy | పెచ్చులూడిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో.. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి గదిలోని పైకప్పు పెచ్చులు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఆ […]

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనం స్థానంలో కొత్తది నిర్మించాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. తమ తల్లిదండ్రులతో కలిసి నిరసన తెలిపారు. ఈ ఘటన కామారెడ్డి మున్సిపాలిటీ (kamareddy Municipality) పరిధిలోని రామేశ్వర్ పల్లి (Rameshwar Pally) గ్రామంలో మంగళవారం చోటు చేసుకుంది.

Kamareddy | పెచ్చులూడిన సమయంలో విద్యార్థులు లేకపోవడంతో..

గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరో తరగతి గదిలోని పైకప్పు పెచ్చులు సోమవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఊడిపడ్డాయి. ఆ సమయంలో విద్యార్థులు మధ్యాహ్నం భోజనం నిమిత్తం బయట ఉన్నారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంగళవారం విద్యార్థులతో కలిసి పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు.

Kamareddy | కలెక్టర్​ చెప్పినా పట్టించుకోవట్లేదు..

పెచ్చులూడిన సమయంలో తరగతి గదిలో తమ పిల్లలు ఉంటే పరిస్థితి ఏమిటని తల్లిదండ్రులు ప్రశ్నించారు. పాఠశాల పరిస్థితి చూసిన కలెక్టర్ ఆశిష్​ సంగ్వాన్ (Collector Ashish Sangwan​)​ డిస్మెంటల్​ చేయాలని ఆర్​అండ్​బీ అధికారులకు ఆదేశాలిచ్చారని గ్రామస్థులు పేర్కొన్నారు. అయితే అధికారులు మాత్రం గ్రామస్థులే పాఠశాలను డిస్మెంటల్ చేయాలని, అయితేనే తాము నూతన భవనానికి ముగ్గు వేస్తామని చెబుతున్నారని వారు పేర్కొన్నారు. తాము ఏమైనా మేస్త్రీ పనిచేసే వాళ్లమా అని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. కలెక్టర్ తమ పాఠశాలకు మరోసారి వచ్చి పరిస్థితిని కళ్లారా చూడాలని విద్యార్థులు కోరుతున్నారు.

పాఠశాలలో పెచ్చులూడిన పైకప్పు

shashi kiran Mottala
shashi kiran Mottala
Author Bio : తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Related articles

సలహాలకు ఫుల్ స్టాప్.. సర్వీస్ కు భరోసా.. గోద్రేజ్ ఏసీల కొత్త ప్రచార చిత్రం విడుదల

ముంబై: ప్రముఖ గృహోపకరణాల సంస్థ 'గోద్రేజ్ అప్లయన్సెస్' వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్త డిజిటల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది. ప్రముఖ నటుడు దేవన్ భోజాని ప్రధాన పాత్రలో...

Telangana Cabinet Decisions | తెలంగాణ రాష్ట్ర కేబినెట్​ నిర్ణయాలపై టీజీఈజేఏసీ హర్షం..

రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ నిర్ణయంపై టీజీఈజేఏసీ హర్షం వ్యక్తం చేసింది. ఈ మేరకు మంగళవారం కమిటీ జిల్లా అధ్యక్షుడు నాశెట్టి సుమన్​కుమార్​ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు.

Forest Officer Bribery Case | లంచం తీసుకుంటూ దొరికిన ఫారెస్ట్​ సెక్షన్​ ఆఫీసర్​

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Officer Bribery Case | మరో అవినీతి తిమింగలం ఏసీబీ (ACB)కి చిక్కింది. రూ.4 లక్షల లంచం తీసుకుంటూ...

SSC Exam Center Rules | ఎస్సెస్సీ పరీక్షా కేంద్రాల్లోకి సీఎస్​, డీవోలకు ఫోన్లు అనుమతి లేదు..

పదో తరగతి పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులతోపాటు చీఫ్ సూపరింటెండెంట్​, డిపార్ట్​మెంట్​ ఆఫీసర్లకు సెల్​ఫోన్ల అనుమతి లేదని కలెక్టర్​ ఇలా త్రిపాఠి అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్​లో అధికారులతో సమావేశం నిర్వహించారు.