ePaper
More
    Homeజిల్లాలునిజామాబాద్​Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    Dichpally | బస్సుల కోసం విద్యార్థుల ఆందోళన

    Published on

    అక్షరటుడే, డిచ్​పల్లి: Dichpally | పాఠశాల సమయాల్లో ఆర్టీసీ బస్సులు నడపాలని విద్యార్థులు డిమాండ్​ చేశారు. ఈ మేరకు బుధవారం పీడీఎస్​యూ (PDSU), టీయూసీఐ (TUCI) ఆధ్వర్యంలో ఘన్​పూర్​(Ghanpur)–డిచ్​పల్లి రోడ్డుపై విద్యార్థులు రాస్తారోకో నిర్వహించారు.

    ఈ సందర్భంగా టీయూసీఐ జిల్లా నాయకులు మురళి మాట్లాడుతూ.. డిచ్​పల్లి (Dicpally) మండలంలో ఘన్​పూర్​, ఇస్లాంపూర్​ నుంచి 60 మంది విద్యార్థులు మోడల్​ స్కూల్​లో చదువుకుంటున్నారన్నారు. అయితే ప్రస్తుతం నడుస్తున్న ఆర్టీసీ బస్సు డిచ్​పల్లి మీదుగా అన్ని గ్రామాలు తిరిగి ఘన్​పూర్​కు వచ్చేసరికి సుమారు గంట ఆలస్యం అవుతోందన్నారు. దీంతో విద్యార్థులు నిత్యం తరగతులకు లేటుగా వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

    ఘన్​పూర్​, ఇస్లాంపూర్​ మీదుగా మోడల్​ స్కూల్​ వరకు ప్రత్యేకంగా ఒక బస్సు నడపాలని డిమాండ్​ చేశారు. ఈ రాస్తారోకోలో పీడీఎస్​యూ నాయకులు కార్తీక్, బబ్లు, కీర్తన, అవంతిక, ఆదిశ్రీ, తేజు, మురళీధర్, నవతేజ, TUCI నాయకులు రాములు, అశోక్, ప్రవీణ్, రమేష్, ప్రేమ్ తదితరులు పాల్గొన్నారు.

    More like this

    Kamareddy | సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన అధికారులు

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈ నెల 15న బీసీ డిక్లరేషన్...

    Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పించాలి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revenue Employees | తహశీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా ప్రమోషన్(Deputy Collectors Promotion)​ కల్పించాలని ట్రెసా...

    Hydraa | ‘వర్టెక్స్’​ భూ వివాదం.. హైడ్రా కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Hydraa | ప్రైవేటు భూములకు సంబంధించిన వివాదాల జోలికి వెళ్ల‌మ‌ని హైడ్రా మ‌రో సారి...