అక్షరటుడే, వెబ్డెస్క్: Helicopter to exam center : ఇటీవల ఓ విద్యార్థిని తాను చదివే విద్యాసంస్థకు గుర్రంపై వెళ్లి వైరల్ అయింది. ఇలాంటి ఘటనే మరోటి చోటుచేసుకుంది.
కాకపోతే ఈ విద్యార్థులు ఏకంగా హెలికాప్టర్లో వెళ్లారు. అదీనూ దానిని అద్దెకు తీసుకుని మరీ వెళ్లారు. కొండ చరియలు విరిగిపడి రోడ్లు మూసుకుపోవడంతో ఇలా పయనించారు.
బీఎడ్ చదువుతున్న రాజస్థాన్కు చెందిన నలుగురు విద్యార్థులు ఉత్తరాఖండ్ Uttarakhand లోని పరీక్ష కేంద్రానికి చేరుకోవాల్సి ఉంది.
వీరి పరీక్ష కేంద్రం మున్సియారిలో ఉంది. ఉత్తరాఖండ్ లో భారీ వర్షం కురువడంతో కొండచరియలు విరిగిపడి ఎగ్జామ్ సెంటర్ exam center కు వెళ్లే రోడ్లన్ని మూసుకుపోయాయి.
దీంతో సదరు విద్యార్థులు హెలికాప్టర్ను అద్దెకు తీసుకున్నారు. అందులో మున్సియారి Munsiyari లోని పరీక్ష కేంద్రానికి చేరుకున్నారు.
రాజస్థాన్ బలోత్రా పట్టణానికి చెందిన విద్యార్థులు ఉత్తరాఖండ్ ఓపెన్ వర్సిటీ ఎగ్జామ్ రాయాల్సి ఉంది. వీరి పరీక్ష కేంద్రం మున్సియారిలోని ఆర్ఎస్ టోలియా పీజీ కాలేజీలో పడింది.
దీంతో ఈ విద్యార్థలు ఆగస్టు 31న హల్వానీకి వెళ్లారు. అయితే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురవడం వల్ల పలుచోట్ల కొండచరియలు landslides విరిగిపడ్డాయి.
Helicopter to exam center : కొండ చరియలు విరిగిపడటంతో..
హల్ద్వానీ నుంచి మున్సియారీకి వెళ్లే మార్గంలో కొండ చరియలు విరిగిపడటంతో రహదారులు మూసుకుపోయాయి.
దీంతో పరీక్ష కేంద్రానికి వెళ్లడమే విద్యార్థులకు అతి పెద్ద పరీక్షగా మారింది. సెంటర్కు ఎలా వెళ్లాలో తెలియక విద్యార్థులు మదనపడ్డారు.
కాగా హల్ద్వానీ నుంచి మున్సియారికి హెలికాప్టర్ ఫెసిలిటీ ఉందని విద్యార్థులకు స్థానికులు తెలిపారు. దీంతో సదరు హెరిటేజ్ ఏవియేషన్ సంస్థ గురించి తెలుసుకున్నారు.
కానీ, ప్రతికూల వాతావరణం ఉండటంతో ఆ సంస్థ సైతం హెలికాప్టర్ నడపడం లేదని తెలిసింది. దీంతో కంపెనీ సీఈవోని సంప్రదించారు.
తమ సమస్యను విన్నవించి అభ్యర్థించారు. దీంతో ఒక హెలికాప్టర్లో ఇద్దరు పైలట్లను ఇచ్చి పంపించారు ఆ సీఈవో.
అలా విద్యార్థులు హెలికాప్టర్లో మున్సియారీకి వెళ్లి పరీక్ష రాసి, తిరిగి హల్ద్వానీకి వచ్చేశారు. ఒకవైపు హెలికాప్టర్ ప్రయాణానికి రూ.5,200 అయినట్లు విద్యార్థలు తెలిపారు.