Homeజిల్లాలునిజామాబాద్​Nizamabad City | కోతుల భయంతో భవనంపై నుంచి దూకిన విద్యార్థిని.. చికిత్స పొందుతూ మృతి

Nizamabad City | కోతుల భయంతో భవనంపై నుంచి దూకిన విద్యార్థిని.. చికిత్స పొందుతూ మృతి

- Advertisement -

అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Nizamabad City | కోతుల (Monkey) మీదకు వస్తున్నాయనే భయంతో ఓ విద్యార్థిని భవనంపై నుంచి దూకింది. తీవ్రగాయాలవడంతో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని దుబ్బ (Dubba) ప్రాంతానికి చెందిన కావేరి ఆర్మూర్ మండలం మామిడిపల్లి (Mamidipally) వద్ద కేజీబీవీ కళాశాలలో(KGBV college) ఇంటర్​ ఫస్టియర్​ చదువుతోంది. బంగ్లాపై ఉన్న హాస్టల్లో ఉంటున్న విద్యార్థి వాష్​రూమ్ కోసమని బయటకు వచ్చింది. బిల్డింగ్​పై కోతుల మందను చూసిన కావేరి ఒక్కసారిగా ఉలిక్కిపడి భవనం పైనుంచి దూకేసింది.

గమనించిన విద్యార్థులు స్థానికుల సహాయంలో హుటాహుటిన కావేరిని సోమవారం రాత్రి నగరంలోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ విద్యార్థి బుధవారం ఉదయం మృతి చెందింది.  విద్యార్థిని మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.