Homeజిల్లాలుకామారెడ్డిEAPCET | ఈఏపీసెట్​ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

EAPCET | ఈఏపీసెట్​ పరీక్ష రాసేందుకు వెళ్లి విద్యార్థిని మృతి

- Advertisement -

అక్షరటుడే, ఎల్లారెడ్డి : EAPCET | ఈఏపీసెట్ EAPCET ​ పరీక్ష రాసేందుకు వెళ్లిన ఓ విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ఘటన బుధవారం ఉదయం మేడ్చల్​ medchal రింగ్​రోడ్డు ring road సమీపంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగంపేట lingampeta మండలం నల్లమడుగు పెద్ద తండాకు చెందిన అర్చన (17) ఇంటర్​ పూర్తయింది. ఆమె ఈఏపీసెట్​ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకోగా మేడ్చల్​ శివారులోని ఓ కాలేజీలో సెంటర్​ పడింది. దీంతో పరీక్ష కోసం మంగళవారమే హైదరాబాద్ hyderabad​ వెళ్లిన అర్చన అక్కడ బంధువుల ఇంట్లో ఉంది. బుధవారం ఉదయం పరీక్ష రాయడానికి తన సోదరుడితో కలిసి బైక్​పై వెళ్తుండగా వీరిని వెనక నుంచి వచ్చిన లారీ ఢీకొంది. ప్రమాదంలో అర్చన రోడ్డుపై పడిపోగా ఆమెపైనుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె అన్న అరవింద్​కు గాయాలయ్యాయి.

Must Read
Related News