అక్షరటుడే, కామారెడ్డి: Municipal Elections | మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ కేంద్రాల్లో పోలీసుల బందోబస్తు, పకడ్బందీ ఏర్పాట్లు చేశామని ఎన్నికల సాధారణ పరిశీలకుడు ప్రశాంత్ రెడ్డి (Observer Prashant Reddy) తెలిపారు. కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో (Kamareddy Municipal office) ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను పరిశీలించారు.
Municipal Elections | లోటుపాట్లు లేకుండా చూడాలి..
మొదటి నామినేషన్ కేంద్రం రెవెన్యూ సెక్షన్లో ఏర్పాటు చేశారు. అక్కడ 1 నుంచి 15 వార్డుల నామినేషన్లు తీసుకుంటున్నారు. అలాగే రెండో నామినేషన్ కేంద్రం కౌన్సిల్ మీటింగ్ హాల్లో 16 నుంచి 45 వార్డుల నామినేషన్లు, మూడో నామినేషన్ కేంద్రాన్ని అకౌంట్స్ సెక్షన్లో ఏర్పాటు చేశారు. అక్కడ 46 నుంచి 49 వార్డుల నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్నికల సాధారణ పరిశీలకుడు మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియను (nomination process) ఎలాంటి లోటుపాట్లు లేకుండా పక్కాగా నిర్వహించాలని అధికారులకు సూచించారు.
Municipal Elections | అభ్యర్థులకు తెలియజేయాలి
నామినేషన్లు స్వీకరించే సమయంలో అభ్యర్థులకు అవసరమయ్యే ధ్రువీకరణ పత్రాల వివరాలను స్పష్టంగా తెలియజేయాలని సూచించారు. ఏవైనా సందేహాలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని తెలిపారు. అన్ని నామినేషన్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, డిజిటల్ వాచ్లు ఏర్పాటు చేయడంతో పాటు పోలీస్ బందోబస్తును పకడ్బందీగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో వీణ, తహశీల్దార్ జనార్దన్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.