Homeజిల్లాలునిజామాబాద్​Paddy Centers | ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​

Paddy Centers | ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా చర్యలు తీసుకోవాలి: కలెక్టర్​

ధాన్యం సేకరణలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు. ఈ మేరకు బోధన్​ మండలంలో మంగళవారం ఆయన పర్యటించారు.

- Advertisement -

అక్షరటుడే, బోధన్ ​: Paddy Centers | ధాన్యం సేకరణలో జాప్యానికి తావులేకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగేందుకు గాను సంబంధిత అధికారులు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. బోధన్ మండలం (Bodhan Mandal) పెగడాపల్లి, సాలూర మండలం సాలంపాడ్ క్యాంప్​లలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ మంగళవారం సందర్శించారు.

Paddy Centers | క్షుణ్ణంగా కేంద్రాల పరిశీలన..

రైతులు (Farmers) తరలించిన ధాన్యం నిల్వలను కలెక్టర్​ పరిశీలించారు. రైతుల నుండి ఇప్పటివరకు సేకరించిన ధాన్యం నిల్వలు, మిల్లులకు తరలించిన ధాన్యం గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించారు. కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చిన రైతులను పలకరించి, కొనుగోలు కేంద్రాల్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీశారు. కౌలు రైతులకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లలో ఒకింత జాప్యం జరుగుతోందని రైతులు కలెక్టర్ దృష్టికి తేగా, కేంద్రం నిర్వాహకులకు కలెక్టర్ (Collector Vinay Krishna Reddy) స్పష్టమైన సూచనలు చేశారు.

Paddy Centers | పంటసాగు వివరాలు నమోదు చేయాలి

పంట సాగు చేసిన ప్రతి రైతు వివరాలు కచ్చితంగా నమోదు చేయాలని కలెక్టర్​ సూచించారు. క్రాప్ బుకింగ్ డేటాలో కౌలు రైతుల పేర్లు లేని పక్షంలో వారు వరిపంట సాగు చేశారా లేదా అన్నది వ్యవసాయ అధికారులు పరిశీలించాలన్నారు. అనంతరం చేసి ధ్రువీకరణ పత్రం అందించాలని, రైతుల వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే వాటిని కూడా సరిచేయాలని ఆదేశించారు. వరుస క్రమంలో రైతుల వివరాలు నమోదు చేసుకుని, ఎఫ్ఏక్యూ ప్రమాణాలకు లోబడి ఉన్న ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేయించాలన్నారు.

Paddy Centers | ట్రక్​షీట్లు వెంటనే అందించాలి

మిల్లుల వద్ద ధాన్యం వేగంగా దిగుమతి చేసుకుని, సత్వరమే ట్రక్ షీట్లు అందించేలా చూడాలని తహశీల్దార్​ను కలెక్టర్​ వినయ్​ కృష్ణారెడ్డి ఆదేశించారు. కాగా.. రైతుల అవసరాలకు అనుగుణంగా ఎన్ని కొనుగోలు కేంద్రాలనైనా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ తెలిపారు. గత సీజన్​లో 600 కేంద్రాలు ఉండగా, ఈసారి 670 కేంద్రాలు నెలకొల్పుతున్నామని, అవసరమైన చోట అదనంగా కూడా కేంద్రాలను అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రైతులు ఇబ్బందులు పడకూడదని, కేంద్రాలకు ధాన్యం తెచ్చిన వెంటనే నాణ్యాతా ప్రమాణాలను పరిశీలించి తూకం జరిపించాలని అధికారులను ఆదేశించారు.

ప్రతి కేంద్రాన్ని సందర్శిస్తూ, ధాన్యం కొనుగోలు ప్రక్రియ సాఫీగా జరిగేలా పకడ్బందీ పర్యవేక్షణ జరపాలన్నారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహతో, డీఆర్డీవో సాయాగౌడ్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి గోవింద్​, తహశీల్దార్ విఠల్, ఏవో సంతోష్, స్థానిక అధికారులు ఉన్నారు.