అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | పహల్గామ్ pahalgamలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడితో యావత్ దేశం దిగ్బ్రాంతికి గురైంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలు తీరని శోకం మిగిలింది. భార్య పిల్లలతో కలిసి కశ్మీర్ అందాలు చూడటానికి వెళ్లిన నెల్లూరు nelluru జిల్లా కావలికి చెందిన మధుసూదన్ కూడా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఆయన మృతదేహాన్ని చూసి కుమారుడు రోదించిన తీరు అందరికి కంటతడి పెట్టించింది. “లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న” అంటూ మధుసూదన్ మృతదేహంపై కుమారుడు దత్తు పడుకొని ఏడ్చాడు. “నువ్వు నాతోనే ఎప్పటికీ ఉండు నాన్న” అంటూ రోదించడంతో అక్కడ ఉన్న వారు సైతం కంటతడి పెట్టుకున్నారు. కాగా.. కావలికి చెందిన మధుసూదన్ బెంగళూరు Bengaluru లో సాఫ్ట్వేర్ software ఉద్యోగం చేస్తూ అక్కడే స్థిరపడ్డాడు.
నాతో ఉండిపో నాన్న.. కంటతడి పెట్టించిన బాలుడి మాటలు
పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిలో నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూదన్ మృతిచెందిన చెందారు. ఆయన మృతదేహాన్ని చూసి కుమారుడు లవ్ యూ నాన్న, ఐ మిస్ యూ నాన్న అంటూ గుండెలవిసేలా రోదించాడు.#PahalgamTerroristAttack #Pahalgam pic.twitter.com/3tRllc12Dh— Akshara Today (@aksharatoday) April 24, 2025