అక్షరటుడే, కోటగిరి: Kotagiti | ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవద్దని ఎస్సై సునీల్ (SI sunil) సూచించారు. మత్తు పదార్థాలు (Drugs), సైబర్ క్రైంపై (Cyber crime) మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం పోలీస్శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఫోన్చేస్తే ఓటీపీలు చెప్పవద్దన్నారు. బైక్లు నడిపితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, త్రిబుల్ రైడింగ్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.