Homeజిల్లాలునిజామాబాద్​Kotagiti | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

Kotagiti | మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

- Advertisement -

అక్షరటుడే, కోటగిరి: Kotagiti | ప్రజలు మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాలు పాడు చేసుకోవద్దని ఎస్సై సునీల్ (SI sunil)​ సూచించారు. మత్తు పదార్థాలు (Drugs), సైబర్​ క్రైంపై (Cyber ​​crime) మండలంలోని కొత్తపల్లిలో మంగళవారం పోలీస్​శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అపరిచిత వ్యక్తులు ఫోన్​చేస్తే ఓటీపీలు చెప్పవద్దన్నారు. బైక్​లు నడిపితే తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని, త్రిబుల్​ రైడింగ్​ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో పోలీస్​ సిబ్బంది, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.