HomeజాతీయంTamil Nadu Stampede | టీవీకే అధినేత విజయ్​ మీటింగ్​లో తొక్కిసలాట.. పది మంది మృతి

Tamil Nadu Stampede | టీవీకే అధినేత విజయ్​ మీటింగ్​లో తొక్కిసలాట.. పది మంది మృతి

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tamil Nadu Stampede | తమిళనాడులో విషాదకర ఘటన చోటు చేసుకుంది. సినీ నటుడు, టీవీకే (TVK) పార్టీ అధినేత విజయ్​ సమావేశంలో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో పది మంది మృతి చెందారు.

కొత్తగా తమిళగ వెట్రి కజగం పార్టీ పెట్టిన విజయ్ (Vijay)​ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని గతంలో ప్రకటించారు. ఈ మేరకు పార్టీ బలోపేతమే లక్ష్యంగా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం ఆయన కరూర్​ (Karur)లో భారీ ప్రచార ర్యాలీ నిర్వహించారు. దీనికి పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలి వచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. తొక్కిసలాటలో పది మంది మృతి చెందగా.. పలువురు గాయపడ్డారు. 22 మంది కరూర్​ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వారిలో 10 మంది పరిస్థితి విషమం ఉన్నట్లు సమాచారం.

Tamil Nadu Stampede | భారీగా ప్రజలు రావడంతో..

ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలి రావడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. పార్టీ కార్యకర్తలు, పలువురు చిన్నారులు ఈ ఘటనలో గాయపడ్డారు. దీంతో విజయ్ తన ప్రసంగాన్ని ఆపి, ప్రశాంతంగా ఉండాలని కోరారు. అనంతరం బాధితులను అంబులెన్స్​ల్లో ఆస్పత్రులకు తరలించారు. గందరగోళం సమయంలో, తొమ్మిదేళ్ల బాలిక తప్పిపోయినట్లు సమాచారం. ముగ్గురు చిన్నారులు కూడా గాయపడ్డారు.

Tamil Nadu Stampede | స్పందించిన సీఎం

కరూర్​ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు సీఎం స్టాలిన్​ (CM Stalin) స్పందించారు. ఆయన జిల్లా కలెక్టర్​తో మాట్లాడారు. ఘటనా స్థలానికి చేరుకుని వైద్య సహాయం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఏడీజీపీ (శాంతిభద్రతలు) డేవిడ్సన్ కూడా ఘటనా స్థలానికి వెళ్లారు. ఆరోగ్య మంత్రి, పాఠశాల విద్యా మంత్రిని కరూర్‌కు వెళ్లాలని సీఎం ఆదేశించారు.

Must Read
Related News