Homeజిల్లాలునిజామాబాద్​Stabbing suspects | కత్తిపోటు నిందితుల అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

Stabbing suspects | కత్తిపోటు నిందితుల అరెస్టు.. రిమాండ్​కు తరలింపు

Stabbing suspects | ఒకరిపై కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించి, గత తొమ్మిది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న భార్యాభర్తలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. నిందితులను అరెస్టు చేసి, రిమాండుకు తరలించారు.

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: Stabbing suspects | ఓ వ్యక్తిపై కత్తితో దాడి చేసి చంపడానికి ప్రయత్నించి, గత తొమ్మిది నెలలుగా తప్పించుకు తిరుగుతున్న భార్యాభర్తలను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

నిందితులను శనివారం రిమాండుకు తరలించారు. నిజామాబాద్​ జిల్లా కేంద్రం Nizamabad district headquarters లోని రెండో ఠాణా Police Station పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.

Stabbing suspects | అసలేం జరిగిందంటే..

నగరంలోని దారుగల్లీకి చెందిన అల్లావుద్దీన్​ ఫారుక్​ అలియాస్​ జుబేర్​(30) స్టీల్స్​ అండ్ హార్డ్​వేర్​ వ్యాపారం చేస్తుంటాడు.

కాగా, గత ఫిబ్రవరి 4వ తేదీన రాత్రి 10 గంటల సమయంలో ఆటోలో ఇంటికి వెళ్తుండగా.. జుబేర్​పై దాడి జరిగింది.

జుబేర్​ ఆటో దిగగానే.. అమీర్ అనే వ్యక్తితోపాటు అతడి భార్య ఆయేషా కలిసి దాడి చేశారు. జుబేర్​ కంట్లో కారం చల్లి, కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించారు.

ఈ ఘటనపై రెండో ఠాణా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులు పారిపోవడంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పోలీసులకు నిందితులు పట్టుబడటంతో వారిని జ్యూడీషియల్​ కస్టడీ judicial custody కి తరలించారు.