ePaper
More
    Homeఆంధ్రప్రదేశ్​Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​...

    Tirumala | ఏఐ టెక్నాలజీతో రెండు గంటల్లో శ్రీవారి దర్శనం కల్పిస్తాం : టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Tirumala | తిరుమలలో కొలువైన శ్రీవారిని నిత్యం వేలాది మంది దర్శనం చేసుకుంటారు. గంటల తరబడి క్యూలైన్​లో వేచి ఉండి స్వామి వారిని దర్శించుకుంటారు. అయితే భక్తుల రద్దీ నేపథ్యంలో టీటీడీ (TTD) పలు కీలక సంస్కారణాలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఏఐ టెక్నాలజీ (AI Technology)తో తిరుమలలో భక్తులకు రెండు గంటల్లో దర్శనం అయ్యేలా చేపట్టడానికి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయంపై టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం బ్రేక్ దర్శన సమయంలో ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు రెండు, మూడు గంటల్లో దర్శనం అసాధ్యమన్నారు. ఏఐ టెక్నాలజీతో వేగవంతంగా దర్శనం కల్పించడం సాధ్యం కాదని పేర్కొన్నారు. ఏఐ పేరిట టీటీడీ ధనాన్ని వృథా చేయడం సరికాదని ఆయన అభిప్రాయ పడ్డారు. ఆయన వ్యాఖ్యలను టీటీడీ ఛైర్మన్​ బీఆర్​ నాయుడు (TTD Chairman BR Naidu) ఖండించారు.

    READ ALSO  Tirumala | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. శ్రీవాణి దర్శన సమయంలో మార్పులు

    Tirumala | గూగుల్​, టీసీఎస్​ సహకారంతో..

    తిరుమలలో శ్రీవారి క్యూ లైన్లలో భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఏఐ టెక్నాలజీని వినియోగించి వేగవంతంగా దర్శనం కల్పించాలని టీటీడీ నిర్ణయించినట్లు ఛైర్మన్​ బీఆర్​ నాయుడు తెలిపారు. గూగుల్ (Google), టీసీఎస్ (TCS)​ లాంటి సంస్థల సహకారంతో ఉచితంగా దీనిని అమలు చేయాలని పాలక మండలి నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. భక్తులకు స్వామివారి దర్శనాన్ని నిర్దేశించిన సమయానికి కల్పించేందుకు, దర్శనం సమయాన్ని భక్తులకు ముందస్తుగా తెలియజేయడానికి మాత్రమే ఏఐ విధానాన్ని అమలు చేస్తామన్నారు. దీంతో భక్తులు ఎక్కువ సమయం కంపార్ట్​మెంట్​లలో వేచి ఉండాల్సిన అవసరం ఉండదన్నారు.

    Tirumala | ఆయన వ్యాఖ్యలు బాధాకరం

    విశ్రాంత ఐఏఎస్ అధికారి, టీటీడీ మాజీ ఈవో ఎల్వీ సుబ్రహ్మణ్యం ఏఐ టెక్నాలజీపై అవగాహన లేకుండా వ్యాఖలు చేయడం బాధాకరమని టీటీడీ ఛైర్మన్​ అన్నారు. తిరుమలలో ఏఐ టెక్నాలజీ నిరుపయోగమని వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదన్నారు. ఇలాంటి మాటలు భక్తుల్లో గందరగోళం సృష్టిస్తాయని పేర్కొన్నారు. దాతల సాయంతో ఉచితంగా చేస్తున్న పనిని కూడా వృథా అనడం ఆయన విజ్ఞతకు వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచమంతా ఏఐ టెక్నాలజీ ఉపయోగిస్తుంటే.. టీటీడీ వాడితే తప్పేంటని ఆయన ప్రశ్నించారు.

    READ ALSO  Tirumala Brahmotsavam | శ్రీవారి భక్తులకు అలర్ట్​.. సెప్టెంబర్​ 24 నుంచి తిరుమలలో బ్రహ్మోత్సవాలు

    Latest articles

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...

    CBI Trap | రూ.10 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : CBI Trap | దేశంలో అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. పైసలు ఇవ్వనిదే పనులు చేయడం...

    More like this

    Kaleshwaram | కాళేశ్వరం అక్రమాలపై కమిషన్​ సీరియస్​.. బాధ్యులపై క్రిమినల్​ ప్రాసిక్యూషన్​కు ఆదేశం

    అక్షరటుడే, హైదరాబాద్: Kaleshwaram : కాళేశ్వరం కమిషన్‌ నివేదికపై ఆదివారం (ఆగస్టు 3) నిర్వహించిన సమావేశం ముగిసిన కాళేశ్వరం...

    Heavy Floods | ఉత్తరప్రదేశ్​లో వర్ష బీభత్సం.. నీట మునిగిన ప్రయాగ్​రాజ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Floods | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh)​లో ఎడతెరిపి లేకుండా వర్షాలు (Rains) కురుస్తున్నాయి....

    Movie Shootings | రేపటి నుంచి షూటింగ్స్​ బంద్​.. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Movie Shootings | తెలుగు ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ (Film Employees Federation) సంచలన...