అక్షరటుడే, వెబ్డెస్క్ : Cyclone Montha | మొంథా తుపాన్ తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించింది. దీని ప్రభావంతో బుధవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా మధ్య తెలంగాణ (Telangana)లో భారీ వర్షం పడటంతో వరద ముంచెత్తింది.
వాగులు, నదులు ఉధృతంగా పారుతున్నాయి.నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లాలో భారీ వర్షంతో డిండి నదికి వరద పోటెత్తింది. వరద ధాటికి హైదరాబాద్– శ్రీశైలం ప్రధాన రహదారి తీవ్రంగా దెబ్బతింది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండలంలోని లత్తీపూర్ గ్రామం సమీపంలో రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో హైదరాబాద్ – శ్రీశైలం (Hyderabad – Srisailam) మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు ప్రత్యామ్నాయా మార్గాలను ఎంచుకోవాలని అధికారులు సూచించారు. రోడ్డు పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు.
వరంగల్-హైదరాబాద్ హైవేలో సైతం భారీగా వరద ప్రవహిస్తోంది. రాఘవాపూర్ దగ్గర రోడ్డు జలమయం అయింది. బుధవారం ఇక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. డివైడర్ను కూల్చేసి గ్రామస్థులు వరద నీటిని మళ్లించారు. దీంతో గురువారం ఉదయం నుంచి రాకపోకలు సాగుతున్నాయి. అయితే రోడ్డుపై నుంచి వరద వెళ్తుండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి.
Cyclone Montha | శ్రీశైలంలో భక్తుల ఇబ్బంది
శ్రీశైలంలో భారీ వర్షం (Heavy Rain)తో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్రీశైలం నుంచి వచ్చే పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. ఘాట్ రోడ్డులో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో పలువురు భక్తులు అక్కడే చిక్కుకుపోయారు. భక్తులకు ఆలయ అధికారులు అన్న ప్రసాదం అందజేశారు. రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు కోరారు.
Traffic came to a halt after a section of the Hyderabad–Srisailam highway was washed away near Lattipur village in Nagarkurnool district due to heavy rains. Authorities are working to restore connectivity. #Hyderabad #Telangana #Nagarkurnool #SrisailamHighway pic.twitter.com/a4I9NPkpzy
— Hyderabad Mail (@Hyderabad_Mail) October 30, 2025

