అక్షరటుడే, ఆర్మూర్: SriramSagar Project | తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ఎగువ కురుస్తున్న వర్షాలకు భారీగా వరదనీరు జలాశయంలోకి వచ్చి చేరుతోంది.
ప్రాజెక్టులో బుధవారం ఉదయం 5,498 క్యూసెక్కుల వరద వచ్చింది. మధ్యాహ్నం 12 గంటలకు 12,769 క్యూసెక్కులకు పెరిగింది. గురువారం 13,540 క్యూసెక్కుల ఇన్ఫ్లో వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పరిధిలోని 6,24,000 ఎకరాలకు ప్రస్తుతం నీటిని వదులుతున్నారు. గతేడాది ఇదే సమయనికి ప్రాజెక్టులో 47.847 టీఎంసీలు, 1081.00 అడుగులు నీటి నిల్వ ఉంది.
SriramSagar Project | కాల్వల ద్వారా నీటి విడుదల
జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా 3,500 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు, సరస్వతి కాల్వ ద్వారా 500 క్యూసెక్కులు నీటిని వదులుతున్నారు. 482 క్యూసెక్కుల నీరు ఆవిరిగా వెళ్తోంది. వరద కాలువ, లక్ష్మి కాలువ (laxmi kaluva), గుత్ప, అలీసాగర్ (Alisagar) ఎత్తిపోతలకు నీటి విడుదలను బుధవారం నిలిపేశారు. కాకతీయ కాలువ (kakatiya kaluva) పరిధిలోని జోన్-1 ఏడు రోజులు జోన్-2కు 8 రోజుల పాటు నీటిని అందించనున్నారు. మిగిలిన కాల్వలకు ఏడు రోజుల ఆన్ ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ కొత్త రవి తెలిపారు.