అక్షరటుడే,మెండోరా/ఎల్లారెడ్డి : Irrigation Projects | ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టు అయిన శ్రీరాంసాగర్ (Sriramsagar)కు వరద ఉధృతి తగ్గింది. దీంతో వరద గేట్లను ఆదివారం ఉదయం అధికారులు మూసివేశారు. అలాగే నిజాంసాగర్కు సింగూరు నుంచి వరద వస్తుండడంతో రెండు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
Irrigation Projects | శ్రీరాంసాగర్లో..
శ్రీరాంసాగర్ జలాశయానికి ప్రస్తుతం వరద ఉధృతి తగ్గింది. దీంతో అధికారులు ప్రాజెక్టు వరద గేట్లను మూసివేశారు. అనంతరం ప్రస్తుతం 9,454 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోంది. దీంతో ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువకు (Saraswati Canal) 650 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. కాకతీయ, లక్ష్మి కాల్వలకు నీటి విడుదలను నిలిపేశారు. ఇక మిషన్ భగీరథకు (Mission Bhagiratha) 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఆవిరి రూపంలో 573 క్యూసెక్కులు పోతోంది. జలాశయం నీటినిల్వ సామర్థ్యం 80.501 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం అంతేస్థాయిలో నీరు నిల్వ ఉంది.
Irrigation projects | నిజాంసాగర్లో..
నిజాంసాగర్ ప్రాజెక్ట్లోకి (Nizamsagar Project) ఎగువ నుంచి ఇన్ఫ్లో వస్తోంది. జలాశయంలోకి ప్రస్తుతం 9,570 క్యూసెక్కుల వరద వస్తుండగా.. అధికారులు రెండు గేట్లు ఎత్తి అంతే మొత్తంలో దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు) కాగా.. అంతే మొత్తంలో నీరు నిల్వ ఉంది.
