Homeజిల్లాలుకామారెడ్డిSriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద

Sriram Sagar | శ్రీరామ్​సాగర్​కు కొనసాగుతున్న వరద

ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. అధికారులు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.

- Advertisement -

అక్షరటుడే, మెండోరా : Sriram Sagar | ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయని శ్రీరామ్​ సాగర్​ ప్రాజెక్ట్ (SRSP)​కు ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. అధికారులు 16 గేట్లను ఎత్తి గోదావరి (Godavari)లోకి నీటిని విడుదల చేస్తున్నారు.

జలాశయంలోకి ప్రస్తుతం 59,454 క్యూసెక్కుల ఇన్​ఫ్లో వస్తోంది. 16 వరద గేట్ల ద్వారా 50 వేల క్యూసెక్కులు, ఎస్కేప్​ గేట్ల ద్వారా 8 వేలు, సరస్వతి కాలువకు 650, మిషన్​ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. గోదావరిలోకి నీటి విడుదల కొనసాగుతుండటంతో నది పరీవాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

Sriram Sagar | నిజాంసాగర్​లోకి..

అక్షరటుడే, ఎల్లారెడ్డి: నిజాంసాగర్​ ప్రాజెక్ట్​ (Nizam Sagar Project)లోకి 27,352 క్యూసెక్కుల వరద వస్తోంది. వరద గేట్ల ద్వారా అంతేమొత్తంలోన నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్​ పూర్తిస్థాయి నీటి మట్టం 1405 (17.8 టీఎంసీలు) అడుగులు కాగా.. ప్రస్తుతం అంతేమొత్తంలో నీరు నిల్వ ఉంది.

Sriram Sagar | యాసంగికి ఢోకా లేనట్లే..

ఉమ్మడి జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులైన శ్రీరామ్​సాగర్​, నిజాంసాగర్​ ప్రాజెక్టులు వానాకాలం పూర్తయినా.. నిండుకుండల్లా ఉన్నాయి. ఇంకా వరద కొనసాగుతోంది. అలాగే పోచారం ప్రాజెక్ట్​ (Pocharam Project) సైతం పొంగి పొర్లుతోంది. చెరువులు సైతం నిండుకుండల్లా ఉన్నాయి. ప్రస్తుతం వానాకాలం సాగు సీజన్ దాదాపుగా​ అయిపోయింది. మరో 15 రోజుల్లో రైతులు యాసంగి సాగుకు భూములను సిద్ధం చేసుకుంటారు. ఈ క్రమంలో ఖరీఫ్​ పూర్తయ్యే వరకు ప్రాజెక్ట్​లకు వరద కొనసాగుతుండటంతో యాసంగి పంటలకు ఢోకా లేదని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.