అక్షరటుడే, ఆర్మూర్: Sriram Sagar | ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్కు స్వల్ప ఇన్ఫ్లో కొనసాగుతోంది. జలాశయం నీటి మట్టం 40 టీఎంసీలు దాటడంతో రైతులు (Farmers) హర్షం వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్లోకి 7,479 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 (80.5 టీఎంసీలు) కాగా.. ప్రస్తుతం 1078.10 (40.02 టీఎంసీలు) అడుగుల నీరు ఉంది.
మహారాష్ట్ర, స్థానికంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్ట్లోకి ఇన్ఫ్లో వస్తోంది. సోమవారం ఉదయం 8,175 క్యూసెక్కుల ఇన్ఫ్లో రాగా అనంతరం 7,479 క్యూసెక్కులకు తగ్గిపోయింది. ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువకు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
Sriram Sagar | రైతుల హర్షం
శ్రీరాంసాగర్(Sriram Sagar) ప్రాజెక్ట్లో నీటి నిల్వ 40 టీఎంసీలకు చేరడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్ట్ కింద లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాకతీయ కాలువ (Kakatiya Canal) ద్వారా ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలకు సాగు నీరు అందిస్తారు. లక్ష్మి కాలువ ద్వారా నిజామాబాద్ జిల్లాలోని పలు మండలాలకు నీరు అందుతోంది. అలాగే సరస్వతి కాలువ (Saraswathi Canal) ద్వారా నిర్మల్ జిల్లాలోని రైతులకు సాగు నీరు విడుదల చేస్తారు. అంతేగాకుండా ఈ ప్రాజెక్ట్ ఆధారంగా అనేక ఎత్తిపోతల పథకాలు నిర్మించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్లో నీరు ఆశాజనకంగా ఉండడంతో రైతులు ఆనంద పడుతున్నారు. నీటిమట్టం 50 టీఎంసీలు దాటిన తర్వాత కాల్వల ద్వారా ఆయకట్టుకు విడుదల చేసే అవకాశం ఉంది. ఏటా ఆగస్టు, సెప్టెంబర్లో నీటి విడుదలను అధికారులు ప్రారంభిస్తారు.