అక్షరటుడే, వెబ్డెస్క్: Sri Lanka : శ్రీలంకలో ఘోర బస్సు ప్రమాదం సంభవించింది. ఆదివారం 75 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు కొండపై నుంచి జారి లోయలో పడిపోవడంతో దాదాపు 21 మంది మరణించారు. 30 మందికి పైగా గాయపడినట్లు పోలీసులు తెలిపారు.
కోట్మలే Kotmale మధ్య కొండ ప్రాంతంలో బస్సు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవరు నియంత్రణ కోల్పోవడంతో బస్సు లోయలో పడినట్లుగా చెబుతున్నారు. బస్సులో బౌద్ధ యాత్రికులు Buddhist pilgrims ఉన్నట్లు తెలిసింది. బుద్ధ పౌర్ణమి సందర్భంగా దక్షిణ యాత్రా స్థలం southern pilgrimage site కటరగమ Kataragama నుంచి వాయువ్య పట్టణం కురునెగలకు వెళ్తుండగా.. కొండ నుంచి 100 మీటర్ల లోతులో పడిపోయిందని పోలీసులు తెలిపారు.