Homeజిల్లాలునిజామాబాద్​BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి

BJP Nizamabad | బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా స్రవంతి రెడ్డి

- Advertisement -

అక్షరటుడే, ఇందూరు: BJP Nizamabad | భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) రాష్ట్ర కార్యదర్శిగా గోపిడి స్రవంతి రెడ్డి (Gopidi Sravanthi Reddy) నియామకమయ్యారు. ఈ మేరకు సోమవారం రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు ఉత్తర్వులు జారీ చేశారు.

స్రవంతి రెడ్డి నగరపాలక సంస్థ లో బీజేపీ ఫ్లోర్​ లీడర్​గా, అధికార ప్రతినిధిగా పనిచేశారు. రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించినందుకు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, ఎంపీ ధర్మపురి అర్వింద్​ (MP Arvind), జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారికి (Dinesh kulachari) ధన్యవాదాలు తెలిపారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించినందుకు పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.