HomeతెలంగాణNizamabad CP | చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..: సీపీ

Nizamabad CP | చదువుతో పాటు క్రీడలూ ముఖ్యమే..: సీపీ

- Advertisement -

అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | క్రీడలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్​బాల్​ ఛాంపియన్​షిప్​ పోటీల (state-level football championship competition) ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫుట్​బాల్​ అంటే ఆషామాషీ క్రీడ కాదని.. టెక్నిక్​తో కూడిన ఆట కాబట్టి సాధన చేసినప్పుడే ఆటలో పరిపూర్ణత వస్తుందని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.350కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కోసం కేటాయించిందని చెప్పారు.

Nizamabad CP | ప్రథమ స్థానం సాధించిన రంగారెడ్డి..

ఫుట్​బాల్​ టోర్నీలో (football tournament) రంగారెడ్డి ప్రథమస్థానం సాధించగా.. నిజామాబాద్​ జట్లు రెండోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్సం​బాల్​ సంఘం అధ్యక్షుడే ఖుద్దూస్​, ఫుట్​బాల్​ కోచ్​ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.