ePaper
More
    Homeభక్తిPuri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    Puri Jagannath | భక్తుల కోసం మూలవిరాట్టే కదిలొచ్చే.. పూరి జగన్నాథ రథయాత్ర విశేషలివే..

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Puri Jagannath : ఆషాఢ శుద్ధ విదియ(Ashadha Shuddha Vidiya)నాడు పూరీ క్షేత్రంలో అంగరంగ వైభవంగా ఆ జగన్నాథుడి రథయాత్ర Rath Yatra సాగుతుంది. ఈ వేడుకను తిలకించడానికి, స్వామివారి రథాన్ని లాగడానికి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఆ జన సంద్రం చేసే జగన్నాథ జయజయ ధ్వానాలతో పూరీ(Puri) పుర వీధులన్నీ ప్రతిధ్వనిస్తాయి. శుక్రవారం(నేడు) జగన్నాథ రథయాత్ర(Jagannath Rath Yatra) నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో రథయాత్రతోపాటు జగన్నాథ ఆలయం విశేషాలు తెలుసుకుందామా..

    ఏ ఆలయంలోనైనా దేవుడు ఏకమూర్తిగానో.. సతీ సమేతంగానో దర్శనమిస్తాడు. కానీ పూరీ జగన్నాథుడు సోదరి సుభద్ర(Subhadra), సోదరుడు బలరాముడి(Balarama)తో కలిసి కొలువుదీరడం గమనార్హం.

    ఊరేగింపు కోసం ఎక్కడా మూల విరాట్టును కదిలించరు. కానీ పూరీ జగన్నాథ ఆలయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఏటా రథయాత్ర సందర్భంగా మూల విరాట్టే భక్తుల కోసం కదిలొస్తాడు. సాధారణంగా రథయాత్ర కోసం ఒకే రథాన్ని వినియోగిస్తారు. కానీ పూరీలో ఏటా దేవదేవుడు కొత్త రథంపై సంచరిస్తాడు.

    Puri Jagannath : పక్కా లెక్కతో రథాల నిర్మాణం..

    రథాల నిర్మాణం రెండు నెలల ప్రక్రియ. పూరి సంస్థానాధీశుడు రథ నిర్మాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తారు. ఆయన ఆదేశాల మేరకు ఆలయ ప్రధాన పూజారి దారు వృక్షాలను 1,072 ముక్కలుగా ఖండిరచి పూరికి తరలిస్తారు. అక్కడ వాటిని రథ(Rath) నిర్మాణం కోసం 2,188 ముక్కలుగా చేస్తారు. 832 ముక్కలను జగన్నాథుడి రథానికి వినియోగిస్తారు. బలరాముడి రథానికి 763 ముక్కలు, సుభద్ర రథాన్ని 593 ముక్కలను వాడుతారు. అక్షయ తృతీయ(Akshaya Tritiya)నాడు రథాల నిర్మాణం ప్రారంభిస్తారు. ఇందులో తొమ్మిది మంది ముఖ్య శిల్పులు, 125 మంది సహాయకులు పాల్గొంటారు. ఆషాఢ శుద్ధ పాడ్యమి నాటికి రథాలను సిద్ధం చేస్తారు.

    ప్రతి రథానికి 250 అడుగుల పొడువు, ఎనిమిది అంగుళాల మందం ఉండే తాళ్లను కడతారు. భక్తులు ఈ తాళ్లను లాగుతూ ముందుకు తీసుకువెళతారు. భక్తుల జయజయధ్వానాల మధ్య రథయాత్ర వైభవంగా సాగుతుంది.

    జగన్నాథుడి రథాన్ని నంది ఘోష(Nandighosh rath) అని, బలభద్రుడి రథాన్ని తాళధ్వజ అని, సుభద్ర రథాన్ని దర్పదళ, పద్మ ధ్వజ అని పిలుస్తారు.

    Puri Jagannath : రాజే సేవకుడు..

    సాధారణంగా పాలకులు ఇతరులతో పనులు చేయిస్తారు. కానీ ఇక్కడ రాజే బంటుగా మారతాడు. పూరీ సంస్థానాధీశుడు స్వయంగా బంగారు చీపురు చేతబట్టి జగన్నాథుడు అధిరోహించే రథాన్ని శుభ్రం చేస్తారు. దీనిని చెరా పహరా(Chera Pahara)గా పిలుస్తారు.

    Puri Jagannath : రోజూ కొత్త జెండా..

    జగన్నాథ క్షేత్రంలోని ప్రధాన ఆలయ గోపురం ఎత్తు నలభై అయిదు అంతస్తుల భవనం. అంత ఎత్తున్న గోపురంపైకి ఎక్కి రోజూ జెండాను మార్చడం ఇక్కడ ఆనవాయితీ. ఇది వందల ఏళ్లుగా వస్తోంది. రోజూ పూజారి ఏ సాయం లేకుండా గోపురంపైకి ఎక్కి జెండాను మారుస్తారు.

    Latest articles

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​...

    Heavy Rains | భారీ వ‌ర్షాలు.. స్తంభించిన ముంబై

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా...

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...

    India – Russia | భార‌త్‌కు బాస‌ట‌గా ర‌ష్యా.. కీల‌క స‌ర‌ఫ‌రాల పున‌రుద్ధ‌ర‌ణ‌కు హామీ

    అక్షరటుడే, నిజాంసాగర్ : India - Russia | అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) తెర లేపిన...

    More like this

    Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విద్యుత్ షాక్.. ఒకరి మృతి

    అక్షరటుడే, కామారెడ్డి : Electric shock | వినాయక విగ్రహం తీసుకెళ్తుండగా విషాదం చోటు చేసుకుంది. విగ్రహానికి కరెంట్​...

    Heavy Rains | భారీ వ‌ర్షాలు.. స్తంభించిన ముంబై

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Heavy Rains | దేశ‌వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. వ‌ర‌ద‌లు పోటెత్త‌డంతో జ‌లాశ‌యాలు నిండుకుండ‌ల్లా...

    KTR | హైదరాబాద్​లో శాంతిభద్రతలు క్షీణించాయి.. కేటీఆర్​ ఆగ్రహం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR | హైదరాబాద్​(Hyderabad) నగరంలో శాంతిభద్రతలు క్షీణించాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​...