HomeతెలంగాణWarangal | స్పెషల్​ బ్రాంచ్​ ఎస్సై ఆత్మహత్య

Warangal | స్పెషల్​ బ్రాంచ్​ ఎస్సై ఆత్మహత్య

వరంగల్ జిల్లాలో స్పెషల్ బ్రాంచ్ ఎస్సై బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబ కలహాలతో పురుగుల మందు తాగిన ఆయన చికిత్స పొందుతూ చనిపోయాడు.

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Warangal | వరంగల్ జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఎస్సై హఫీజ్(Special Branch SI Hafeez)  ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాలతో ఆయన పురుగుల మందు తాగగా.. చికిత్స పొందుతూ మరణించాడు.

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి ఎండీ హఫీజ్ ఉద్దీన్ (58) స్పెషల్​ బ్రాంచ్​లో ఎస్సైగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఖానాపురం, చెన్నారావుపేట మండలాల్లో క్షేత్రస్థాయి అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే కుమార్తె, అల్లుడి వేధింపుల కారణంగా ఆయన శుక్రవారం రాత్రి తన ఇంట్లో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే వరంగల్​లోని ఓ ప్రైవేట్​ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హఫీజ్‌ మృతి చెందారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Warangal | కలవరపెడుతున్న ఆత్మహత్యలు

పోలీస్​ శాఖలో విధులు నిర్వహించే ధైర్యంగా ఉంటారు. అయితే ఇటీవల ఆ శాఖలో సిబ్బంది ఆత్మహత్య చేసుకుంటుండటం ఖాకీలను కలవరపెడుతోంది. ఇతరులు సూసైడ్​ అటెంప్ట్​ చేస్తే కౌన్సెలింగ్​ ఇవ్వాల్సిన పోలీసులే మనోధైర్యం కోల్పోయి తనువు చాలిస్తున్నారు. ఇటీవల సూర్యాపేట (Suryapet) జిల్లాలోని నాగారం పోలీస్ స్టేషన్​లో ఎస్​బీ ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ గౌడ్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలే ఇందుకు కారణమని సమాచారం. ఖమ్మం జిల్లాలో ఓ కానిస్టేబుల్​ ఆగస్ట్​లో బలవన్మరణానికి పాల్పడ్డాడు.

Must Read
Related News